పంజాబ్ కింగ్స్ తో ఉత్కంఠ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. అయితే పాండ్యా ఆనందం కాసేపైనా లేకుండా పోయింది. నిర్ణీత టైంలో ఇన్సింగ్స్ ను పూర్తి చేయని కెప్టెన్ లకు ఐపీఎల్ నిర్వాహకులు భారీ జరిమానాలు విధిస్తున్నారు.
ఈ మ్యాచ్ ను మేం ముందే ఫినిష్ చేస్తే బాగుండేది.. కానీ ఆఖరి ఓవర్ వరకు తీసుకొచ్చాం.. నాకు మ్యా్చ్ లు ఇలా చివరి ఓవర్ వరకూ రావడం పెద్దగా నచ్చవు అని హార్థిక్ పాండ్యా చెప్పాడు.
గుజరాత్ టైటాన్స్ విజయాలు సాధిస్తున్నప్పటికీ.. ఆ టీమ్ సారథి హార్థిక్ పాండ్యా మాత్రం తీవ్ర నిరాపరుస్తున్నాడు. గతేడాది అద్భుతంగా రాణించిన హార్థిక్.. ఈ సీజన్ లో మాత్రం బ్యాటింగ్-బౌలింగ్ లో దారుణంగా విఫలమవుతున్నాడు.