Home
Gujarat
Gujarat News
-
గుజరాత్లో కడలి కల్లోలం… మునిగిపోయిన 12 బోట్లు…
గుజరాత్లో కడలి కల్లోలం సృష్టించింది. దీంతో 12 మత్స్యకారుల బోట్లు సముద్రంలో మునిగిపోయాయి. 12 బోట్లలో మొత్తం 23 మంది మత్స్యకారులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇందులో 11 మందిని సురక్షితంగా కాపాడు. మిగతా 12 మంది మత్స్యకారుల కోసం అధికారులు గాలిస్తున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి వాతారవణంలో మార్పులు వస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ, అధికారులు మత్స్యకారులను హెచ్చరిస్తూ వస్తున్నారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. Read: ఇలాంటి పెళ్లి పత్రికను ఎక్కడా… -
బంపర్ ఆఫర్: వ్యాక్సిన్ వేయించుకుంటే…స్మార్ట్ ఫోన్ ఫ్రీ…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా అమలు చేస్తున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా ఈ ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. వ్యాక్సినేషన్ను వేగవంతం చేసేందుకు ప్రభుత్వాలు వినూత్నంగా ఆలోచిస్తున్నాయి. బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదం పొంచియున్న నేపథ్యంలో 100 శాతం వ్యాక్సినేషన్ను వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వాలు సన్నద్ధం అవుతున్నాయి. Read: వంశీ నోరు అదుపులో పెట్టుకోవాలి… టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్… గుజరాత్ లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ వినూత్నంగా… -
26న 4 లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ.. ఆ చట్టం తేవాల్సిందే..!
కేంద్రం కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాల్సిందే.. లేకపోతే ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు సంయుక్త కిసాన్ మెర్చా నేత రాకేష్ టికాయత్.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు చేస్తున్న ఆందోళన ఏడాది దాటింది.. ఇక, ఆ వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ.. రైతులకు క్షమాపణలు కూడా చెప్పారు.. అయితే, కనీస మద్దతు ధర చట్టం తెచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతు సంఘాలు చెబుతున్నాయి..… -
వీడు మామూలు దొంగ కాదు… చోరి చేసేందుకు…
దొంగతనం చేయాలంటే దానికి తగిన విధంగా విధంగా పక్కాగా ప్లాన్ ఉండాలి. ఎవరికీ అనుమానం రాకూడదు. సీసీ కెమెరాలకు దొరక్కుండా దొంగతనం చేయాలి. అయితే, వీటితో పాటుగా ఓ దొంగ వెరైటీగా ప్లాన్ చేశాడు. తన పాత యజమాని ఇంటికి కన్నం వేయడం కోసం ఏకంగా 5 కిలోల బరువు తగ్గాడు. వేసుకున్న ప్లాన్ను పక్కాగా అమలు చేసి నగుదు దోచుకెళ్లాడు. అయితే, ఓ వస్తువును అక్కడే వదిలేయడంతో పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే… Read: తీరం… -
మౌలిక వసతుల కల్పన.. దిగజారిన తెలుగు రాష్ట్రాలు
మౌలిక వసతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ర్యాంకులు దిగజారాయి.. గతంలో ఉన్న ర్యాంకులు నిలబెట్టుకోకపోగా.. రెండు రాష్ట్రాలు తమ ర్యాంకులను కోల్పోయి.. కిందికి దిగజారాయి.. రాష్ట్రాల “లాజిస్టిక్స్ ప్రొఫైల్స్”ను కేంద్ర మంత్రి పియూష్ గోయల్ విడుదల చేశారు.. ఈ సారి గుజరాత్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు వరుసగా మూడు స్థానాల్లో నిలిచాయి.. అయితే, 2019లో మూడో ర్యాంక్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ 2021 నాటికి తొమ్మిదో ర్యాంక్కు దిగజారిపోయింది.. అలాగే, తెలంగాణ 2019లో ఎనిమిదో ర్యాంక్లో ఉండగా, 2021… -
గుజరాత్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై ఎంతంటే?
ఒకవైపు దీపావళి పండుగ.. మరోవైపు పండుగ సందడి వేళ గుజరాత్ లోని ద్వారక ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ మధ్య కాలంలో తరచూ సంభవిస్తున్న భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా దీపావళి పండుగనాడు గురువారం గుజరాత్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ద్వారకకు ఉత్తర వాయువ్య దిశగా 223 కిలోమీటర్ల… -
దీపావళి ధమాకా…పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల్లో ఎంతెంత తగ్గాయి?
దీపావళి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ప్రతిరోజు పెరుగుతున్న వేళ ఉపశమనం కలిగించింది కేంద్రం. దీపావళి వేళ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన సంగతి తెలిసిందే. పెట్రోల్ పై 5, డీజిల్ పై 10 రూపాయలు తగ్గించడంతో ధరలు దిగివచ్చాయి. ఈ తగ్గింపు ధరలు గురువారం ఉదయం నుంచి అమలులోకి… -
మ్యాన్హోల్పై పిల్లల ప్రయోగం… తృటిలో తప్పిన ప్రమాదం…
దీపావళి వస్తుంది అంటే పిల్లలు ఎంత సంతోషిస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటుంటారు. టపాసులు కాల్చే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రమాదాలు తప్పవు. గుజరాత్లోని సూరత్లో నలుగురు చిన్నారులు చేసిన పని పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. అయితే, అప్రమత్తం కావడంతో తృటిలో ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. సూరత్లోని ఓ ఇంటి ముందు నలుగురు పిల్లలు టపాసులు తీసుకొని వచ్చి వాటిని మ్యాన్హోల్పై ఉంచారు. టపాసుల్లోని భాస్వరాన్ని కాగితంపై పోసి… -
సూరత్లో భారీ అగ్నిప్రమాదం…
గుజరాత్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన సూరత్లో అగ్నిప్రమాదం సంభవించింది. మాస్కులు తయారు చేసే పరిశ్రమలో ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పరిశ్రమలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిశ్రమలో అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది. Read:… -
పండుగ ఆఫర్: వ్యాక్సిన్ వేసుకుంటే వంట నూనె ఫ్రీ, లక్కీ డ్రా కూపన్..
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఇప్పుడు అంతా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.. అయితే, ఇంకా కొందరిలో అపోహలు ఉన్నాయి.. వారి అపోహలు వీడి వ్యాక్సిన్ కోసం అడుగులు వేసేలే.. పలు సంస్థలు రకరకాల స్కీమ్లను ప్రవేశ పెడుతున్నాయి. ఇందులో భాగంగా గుజరాత్లోని అమ్వాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) కొత్తగా ఓ ఆఫర్ తీసుకొచ్చింది… వ్యాక్సినేషన్కు, పండుగకు లింక్ చేసి.. మరీ ఆఫర్ ప్రకటించింది ఏఎంసీ.. ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకుంటే లీటర్ వంట నూనె ప్యాకెట్ ఉచితంగా…
తాజావార్తలు
-
Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?