ఢిల్లీకే పరిమితం కాకుండా.. క్రమంగా రాష్ట్రాలపై ఫోకస్ పెడుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇప్పటికే పంజాబ్లో జెండా ఎగరవేసింది.. ఇప్పుడు గుజరాత్లో గెలుపే లక్ష్యంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాలు రచిస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలతో వరుసగా సమావేశం అవుతున్నారు. విద్యావంతులు, ఆటోడ్రైవర్లు, కర్షకులతో… ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఒకవైపు ఎన్నికల ప్రచారం చేస్తూనే… మరోవైపు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అహ్మదాబాద్ పర్యటనలో ఉన్న కేజ్రీవాల్.. అక్కడి ఆటోరిక్షా డ్రైవర్లతో భేటీ అయ్యారు. Read Also: Smriti…
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఆప్ కార్యాలయంలో గుజరాత్ పోలీసులు ఆదివారం సాయంత్రం సోదాలు చేసి ఏమీ కనుగొనకుండా వెళ్లిపోయారని ఆప్ నేతలు ఆరోపించారు. అయితే అహ్మదాబాద్ పోలీసులు మాత్రం అలాంటి దాడులు చేయలేదని కొట్టిపారేశారు.
Surat Fire Accident: గుజరాత్ రాష్ట్రంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సూరత్ నగరంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సచిన్ గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాంతంలో ఉన్న అనుమప్ రసయాన్ ఇండియా లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ప్రమాదకర రసాయనాలు నిల్వ ఉంచే కంటైనర్ లో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి.
గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా ఆరు-ఏడు రాష్ట్రాల్లో లంపి చర్మ వ్యాధి వ్యాపించింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ లంపి చర్మ వ్యాధి కారణంగా ఇప్పటివరకు సుమారు 57,000 పశువులు చనిపోయాయని, వ్యాధిని నియంత్రించడానికి టీకా ప్రక్రియను పెంచాలని బాధిత రాష్ట్రాలను కేంద్రం గురువారం కోరింది.
గుజరాత్ పర్యటనలో ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భగవద్గీతలోని శ్లోకాన్ని తప్పుగా పలికిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు రోజుల పాటు గుజరాత్లో పర్యటించిన కేజ్రీవాల్ ఈ సూచన చేశారు.
గుజరాత్లోని మొత్తం 33 జిల్లాల్లో 17 జిల్లాల్లో ఇప్పటివరకు 1,200లకు పైగా పశువులు లంపి చర్మవ్యాధితో చనిపోయాయని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో తెలిసింది. ప్రభుత్వం చికిత్సతో పాటు వ్యాక్సినేషన్ను ముమ్మరం చేసిందని, అదే సమయంలో జంతు ప్రదర్శనలను కూడా నిషేధించిందని అధికారులు ఆదివారం తెలిపారు.
గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో శుక్రవారం ఉదయం 12 ఏళ్ల బాలిక 500 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయింది. 5 గంటల పాటు ఆర్మీ, పోలీసు బృందాలు శ్రమించి ఎట్టకేలకు ఆ బాలికను రక్షించారు. ఈ ఘటన ధృంగాధ్ర తహసీల్లోని గజన్వావ్ గ్రామంలో చోటుచేసుకుంది.