AP Crime: బాలికను 3 రోజులు నిర్బంధించి సామూహిక అత్యాచారం.. 8 మంది అరెస్ట్..
- మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో వీడిన మిస్టరీ..
- కేసును ఛేదించిన ఆత్కూరు పోలీసులు..
- బాలికను కిడ్నాప్ చేసి మూడు రోజులు గ్యాంగ్ రేప్..
- 8 మంది యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసిన మరో సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపుతోంది.. గన్నవరంలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులోని మిస్టరీని ఛేదించారు ఆత్కూరు పోలీసులు.. గన్నవరం మండలం వీరపనేని గూడెంలో ఈనెల 9వ తేదీన స్నేహితురాలి ఇంటి నుండి రాత్రి సమయంలో బయటకు వచ్చిన మైనర్ బాలిక అదృశ్యమైంది.. అయితే, కొంత మంది యువకులు ఆ రాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికను అపహరించి వీరపనేని గూడెం శివారు ప్రాంతంలో మూడు రోజుల పాటు నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు..
Read Also: Ponnam Prabhakar: మా జిల్లాలోని దేవాలయాలపై ప్రకటనలు చేశారు.. డబ్బులు ఇవ్వలేదు!
Also Read
- Cyber Fraud: సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్.. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా.!
- Wife Murder: స్మూతీలో విషం? అమెరికాలో భార్యను కడతేర్చిన తెలంగాణ భర్త కేసులో సంచలన విషయాలు!
- Tirupati Double Murder: తిరుపతిలో జంట హత్యల కలకలం.. పెళ్లి వేడుకలో కత్తులతో దాడి..
- USA: అమెరికాలో భార్యను హత్య చేసిన తెలంగాణ టెక్కీ.. జీవితఖైదు పడే అవకాశం
ఇక, మూడో రోజు గన్నవరం మండలం కేసరపల్లి శివారు ప్రాంతంలో ఉన్న తన స్నేహితుని వద్దకు బాలికను తీసుకెళ్లిన యువకులు.. మళ్లీ పాశవికంగా ఆ బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు. అయితే, నాలుగు రోజుల తర్వాత మైనర్ బాలికను ఒక ఆటో ఎక్కించి విజయవాడలో దింపమని చెప్పి పంపించారు యువకులు.. ఇక, ఆటో డ్రైవర్ సహాయంతో విజయవాడ పోలీసులను ఆశ్రయించిన బాలిక.. తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు వివరించింది.. దీంతో, ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.. విజయవాడ నుండి ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్కు కేసును పంపగా సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించారు పోలీసులు. ఈ కేసులో మొత్తం 8 మంది యువకులు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.. నిందితుల్లో ఒకరు పదో తరగతి పరీక్ష రాసినట్టుగా కూడా గుర్తించారు పోలీసులు..
తాజావార్తలు
-
England vs India: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ .. చెత్త రికార్డులు మూటగట్టుకున్న టీమిండియా..
-
Harry Brook: టీమిండియా ఓడిపోతుంటే ఫుల్ హ్యాపీగా ఉంది.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
-
Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
-
Prabhas : ‘ఫౌజీ’ బిజినెస్ వేట షురూ.. భారీ రేటుకు నార్త్ ఇండియా, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్!
-
Cyber Fraud: సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్.. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా.!
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!