AP Crime: బాలికను 3 రోజులు నిర్బంధించి సామూహిక అత్యాచారం.. 8 మంది అరెస్ట్..
- మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో వీడిన మిస్టరీ..
- కేసును ఛేదించిన ఆత్కూరు పోలీసులు..
- బాలికను కిడ్నాప్ చేసి మూడు రోజులు గ్యాంగ్ రేప్..
- 8 మంది యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసిన మరో సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపుతోంది.. గన్నవరంలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులోని మిస్టరీని ఛేదించారు ఆత్కూరు పోలీసులు.. గన్నవరం మండలం వీరపనేని గూడెంలో ఈనెల 9వ తేదీన స్నేహితురాలి ఇంటి నుండి రాత్రి సమయంలో బయటకు వచ్చిన మైనర్ బాలిక అదృశ్యమైంది.. అయితే, కొంత మంది యువకులు ఆ రాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికను అపహరించి వీరపనేని గూడెం శివారు ప్రాంతంలో మూడు రోజుల పాటు నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు..
Read Also: Ponnam Prabhakar: మా జిల్లాలోని దేవాలయాలపై ప్రకటనలు చేశారు.. డబ్బులు ఇవ్వలేదు!
Also Read
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
- Moizuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్గా న్యాయవాది హత్య స్కెచ్.!
- TV Serial Scam: హీరోయిన్ ఛాన్స్ పేరుతో సైబర్ మోసం.. విశాఖలో రూ.60 లక్షల దోపిడీ!
- Hyderabad: న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య వెనుక మిస్టరీ ఇంతుందా?
ఇక, మూడో రోజు గన్నవరం మండలం కేసరపల్లి శివారు ప్రాంతంలో ఉన్న తన స్నేహితుని వద్దకు బాలికను తీసుకెళ్లిన యువకులు.. మళ్లీ పాశవికంగా ఆ బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు. అయితే, నాలుగు రోజుల తర్వాత మైనర్ బాలికను ఒక ఆటో ఎక్కించి విజయవాడలో దింపమని చెప్పి పంపించారు యువకులు.. ఇక, ఆటో డ్రైవర్ సహాయంతో విజయవాడ పోలీసులను ఆశ్రయించిన బాలిక.. తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు వివరించింది.. దీంతో, ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.. విజయవాడ నుండి ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్కు కేసును పంపగా సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించారు పోలీసులు. ఈ కేసులో మొత్తం 8 మంది యువకులు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.. నిందితుల్లో ఒకరు పదో తరగతి పరీక్ష రాసినట్టుగా కూడా గుర్తించారు పోలీసులు..
తాజావార్తలు
-
IPL 2026 Final: ఫైనల్ కు వర్షం గండం.. మరి రిజర్వ్ డే సంగతేంటి.?
-
Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
-
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
-
Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
-
Kumar Sangakkara: కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్లో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..