AP Crime: బాలికను 3 రోజులు నిర్బంధించి సామూహిక అత్యాచారం.. 8 మంది అరెస్ట్..
- మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో వీడిన మిస్టరీ..
- కేసును ఛేదించిన ఆత్కూరు పోలీసులు..
- బాలికను కిడ్నాప్ చేసి మూడు రోజులు గ్యాంగ్ రేప్..
- 8 మంది యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసిన మరో సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపుతోంది.. గన్నవరంలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులోని మిస్టరీని ఛేదించారు ఆత్కూరు పోలీసులు.. గన్నవరం మండలం వీరపనేని గూడెంలో ఈనెల 9వ తేదీన స్నేహితురాలి ఇంటి నుండి రాత్రి సమయంలో బయటకు వచ్చిన మైనర్ బాలిక అదృశ్యమైంది.. అయితే, కొంత మంది యువకులు ఆ రాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికను అపహరించి వీరపనేని గూడెం శివారు ప్రాంతంలో మూడు రోజుల పాటు నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు..
Read Also: Ponnam Prabhakar: మా జిల్లాలోని దేవాలయాలపై ప్రకటనలు చేశారు.. డబ్బులు ఇవ్వలేదు!
Also Read
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
ఇక, మూడో రోజు గన్నవరం మండలం కేసరపల్లి శివారు ప్రాంతంలో ఉన్న తన స్నేహితుని వద్దకు బాలికను తీసుకెళ్లిన యువకులు.. మళ్లీ పాశవికంగా ఆ బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు. అయితే, నాలుగు రోజుల తర్వాత మైనర్ బాలికను ఒక ఆటో ఎక్కించి విజయవాడలో దింపమని చెప్పి పంపించారు యువకులు.. ఇక, ఆటో డ్రైవర్ సహాయంతో విజయవాడ పోలీసులను ఆశ్రయించిన బాలిక.. తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు వివరించింది.. దీంతో, ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.. విజయవాడ నుండి ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్కు కేసును పంపగా సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించారు పోలీసులు. ఈ కేసులో మొత్తం 8 మంది యువకులు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.. నిందితుల్లో ఒకరు పదో తరగతి పరీక్ష రాసినట్టుగా కూడా గుర్తించారు పోలీసులు..
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం
-
Narendra Modi : సీఎం రేవంత్కు మోడీ కౌంటర్..
-
Mamata Banerjee: మమత పార్టీలో ముసలం.. నేతల తిరుగుబాటు మొదలు..
-
CM Revanth Reddy: గుజరాత్కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..
-
PM Modi: ప్రధాని మోడీ పర్యటనలో బాంబు కలకలం.. బెంగళూరులో హై టెన్షన్!