భారత్, ఇటలీ దేశాల ప్రధానుల మధ్య ఉన్న స్నేహబంధం కెమెరాకు చిక్కింది. ప్రధాని మోడీ ని మెలోని కలిసినప్పుడు, ఇరువురు నేతలు నమస్తే సంజ్ఞలతో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆహ్లాదాన్ని పంచుకుంటూ, ఇరువురు నేతలూ వారి సంభాషణ తర్వాత నవ్వారు ఈ వీడియోలో. ఇకపోతే G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ పాల్గొనడం ఇది వరుసగా ఐదవసారి. గత పది శిఖరాగ్ర సమావేశాలకు భారత్ హాజరయ్యారు. ఇటలీ G7 అధ్యక్షుడిగా యూరోపియన్ యూనియన్తో పాటు కెనడా, ఫ్రాన్స్,…
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం ‘నమస్తే’ అంటూ పలకరించుకున్నారు. జార్జియా మెలోని ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఇటలీ వెళ్లిన సంగతి తెలిసిందే. వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రధాని మోడీ తొలిసారిగా జీ7 సదస్సుకు భారత్కు ఆహ్వానం అందింది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. ఫోటోగ్రాఫ్ కోసం సభ్యదేశాల దేశాధినేతలు ఫోజ్ ఇచ్చే సమయంలో వారి నుంచి దూరంగా వెళ్లిన బైడెన్ అభివాదం చేయడం వీడియోలో కనిపించింది.
Italy: ప్రతిష్టాత్మక జీ-7 సమ్మిట్కి ఇటలీ వేదిక అవుతుంది. ఈ సమావేశం కోసం ప్రధాని నరేంద్రమోడీతో పాటు జీ-7 సభ్యదేశాల దేశాధినేతలు ఇప్పటికే అక్కడి చేరుకున్నారు. వీరందరిని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సాదరంగా ఆహ్వానించారు.
Giorgia Meloni: ఇటలీ వేదికగా జీ-7 సదస్సు జరగబోతోంది. జూన్ 13-14 తేదీల్లో అపులియాలో ఈ సమ్మిట్ జరగబోతోంది. జీ-7లో గ్రూప్లోని అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, యూకే దేశాధినేతలు ఇప్పటికే ఇటలీ చేరుకున్నారు.
నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీ-7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్తున్నారు. ఇటీవల మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీకిది తొలి విదేశీ పర్యటన కాబోతుంది.
PM Modi: లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వచ్చింది. 543 సీట్లలో బీజేపీ కూటమి 293 సీట్లను కైవసం చేసుకుని మెజారిటీ సాధించింది. ఆదివారం రోజు మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గురువారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ఫోన్లో మాట్లాడారు. జూన్లో ఇటలీలో జరిగే G7 సమ్మిట్కు ఆహ్వానం పంపినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ రోజు సోషల్ మీడియాలో #Melodi ట్రెండ్ అవుతోంది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని బీచ్ లో నడుస్తున్న ఫోటోను ప్రజలు ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటున్నారు. ఈ ఫోటోలో మెలోనీ బీచ్ను శుభ్రం చేస్తూ కనిపించింది.. నేను హఠాత్తుగా సముద్ర తీరాన్ని ప్రేమించడం మొదలుపెట్టాను అనే ఈ శీర్షికతో ఈ పిక్ వైరల్ అవుతుంది.
యూరప్కు ముఖద్వారమైన ఇటలీ భారతీయులకు తలుపులు తెరిచింది. భారత్, ఇటలీ ఇటీవల 'మైగ్రేషన్ అండ్ మొబిలిటీ' ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందానికి భారత మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఇటలీతో ఈ ఒప్పందం ద్వైపాక్షిక ఒప్పందాలను బలోపేతం చేయడమే కాకుండా అక్రమ వలసలను కూడా నిరోధించనుంది.