Giorgia Meloni: అత్యంత ప్రభావవంతమైన పొలిటికల్ నేతగా నిలిచిన ఇటలీ ప్రధాని
- మరో ఘనత సాధించిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోని
- అత్యంత ప్రభావవంతమైన పొలిటికల్ నేతగా మొదటి స్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మరో ఘనత సాధించారు. ఇటలీ చరిత్రలో ఒక మహిళ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఘనత ఆమెకే దక్కుతుంది. తాజాగా మరో ఘనత సాధించారు. ఐరోపాలో అత్యంత ప్రభావవంతమైన పొలిటికల్ వ్యక్తుల్లో ఆమె అగ్ర స్థానంలో నిలిచారు. తాజా ర్యాంకింగ్లో 28 మంది వ్యక్తుల జాబితాలో మెలోని అగ్రస్థానంలో నిలిచారు.
జార్జియా మెలోని ఇటాలియన్ రాజకీయ నాయకురాలు. అక్టోబరు 2022 నుంచి ఇటలీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటాలియన్ ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన మొదటి మహిళ ఈమె కావడం విశేషం. 2006 నుంచి ఛాంబర్ ఆఫ్ డెప్యూటీస్ సభ్యురాలిగా వ్యవహరించారు. 2014 నుంచి బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి నాయకత్వం వహించారు. 2020 నుంచి యూరోపియన్ కన్జర్వేటివ్స్ , రిఫార్మిస్ట్స్ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నారు.
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..

2008లో ఆమెకు ఇటలీ ప్రభుత్వంలో యువజన శాఖ మంత్రి పదవి లభించింది. దీంతో ఇటలీ రాజకీయాల్లో అతిపిన్న వయస్కురాలైన మంత్రిగా ఆమె రికార్డు సృష్టించింది. 2012 వరకూ ఆమె ఉన్న రాజకీయ పార్టీ సంక్షోభంలోకి జారిపోవడంతో దాన్ని విభజించి బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీని మరో ఇద్దరు రాజకీయ సహచరులతో స్థాపించింది. 2014లో దానికి అధ్యక్షురాలయ్యారు. 2014లో జరిగిన యూరోపియన్ పార్లమెంటు ఎన్నికల్లోనూ, 2016లో జరిగిన రోమ్ పురపాలక ఎన్నికల్లోనూ ఆమె పోటీచేసి ఓడిపోయారు.

2018 ఇటాలియన్ సాధారణ ఎన్నికల తర్వాత శాసనసభకు ఎంపికై బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ తరఫున ప్రతిపక్ష నాయకురాలిగా నేతృత్వం వహించారు. క్రమేపీ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ ప్రజాదరణ పెంచుకుంటూ వచ్చింది. 2022 ఇటాలియన్ సాధారణ ఎన్నికల్లో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ విజయం సాధించింది. దీంతో ఆమె ఇటలీ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.
ఇక మెలోని.. అన్ని దేశాల ప్రధానమంత్రులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రధానమంత్రులు ఎక్కడ కలుసుకున్నా.. ఆపాయ్యంగా పలకరిస్తుంటారు. భారత్తో కూడా మెలోనికి మంచి సంబంధాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!