CM Yogi Adityanath: ఎన్నికల్లో కాంగ్రెస్ ‘‘జార్జ్ సోరోస్’’ డబ్బు వినియోగించింది..
- ఎన్నికల్లో కాంగ్రెస్ ‘‘సోరోస్’’ డబ్బు ఉపయోగించింది..
- కొందరు భావప్రకటనా హక్కుని జన్మహక్కుగా భావిస్తున్నారు..
- ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Yogi Adityanath: కాంగ్రెస్పై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ‘‘జార్జ్ సోరోస్’’ డబ్బు వినియోగించిందని ఆరోపించారు. కర్ణాటకలో 4 శాతం ముస్లిం కోటాపై మాట్లాడుతూ, ఇది బాబా సాహెబ్ అంబేద్కర్కి తీవ్ర అవమానం అని అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేయడమే కాకుండా, విదేశీ డబ్బును వినియోగించారని అన్నారు. గతంలో నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని కూల్చడంపై జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యల్ని యోగి ప్రస్తావించారు. లోక్సభ ఎన్నికల్లో విదేశీ డబ్బు ప్రమేయం ఉందని, ఇందులో కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు పాల్గొన్నాయని, వీరు ఆ డబ్బు ద్వారా ఎన్నికల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపించారు. ఇది దేశద్రోహానికి సమానం అని చెప్పారు.
Read Also: Hero Karizma XMR 250: స్పోర్టీ లుక్, అధునాతన ఫీచర్లతో రాబోతున్న హీరో కరిజ్మా XMR 250
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
సోరోస్తో సంబంధం ఉన్న సంస్థలు భారతదేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని బీజేపీ తరుచుగా ఆరోపిస్తుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్తో సహా ఈ సంస్థలు రూపొందించిన నివేదికలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందని విమర్శిస్తుంది. సోరోస్ నిధులతో నడిచే ఏషియా పసిఫిక్ ఫౌండేషన్లో డెమోక్రటిక్ లీడర్స్ ఫోరంతో సోనియా గాంధీకి సంబంధలు ఉన్నాయని బీజేపీ గతంలో ఆరోపించింది. ఈ సంస్థకు ఆమె కో-చీఫ్గా పనిచేశారు.
ఇదిలా ఉంటే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేని ‘‘దేశద్రోహి’’ అని విమర్శించి కామెడీ యాక్టర్ కునాల్ కమ్రాపై యోగి స్పందించారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భావప్రకటన స్వేచ్ఛని కొందరు వ్యక్తిగత దాడులకు ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. ‘‘కానీ దురదృష్టవశాత్తు, కొంతమంది ఈ స్వేచ్ఛను ఉపయోగించి దేశాన్ని ముక్కలు చేయడానికి, విభజనను విస్తృతం చేయడానికి తమ జన్మహక్కు అని భావిస్తున్నారు’’ అని యోగి అన్నారు. ప్రస్తుతం కునాల్ వ్యవహారం మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!