CM Yogi Adityanath: ఎన్నికల్లో కాంగ్రెస్ ‘‘జార్జ్ సోరోస్’’ డబ్బు వినియోగించింది..
- ఎన్నికల్లో కాంగ్రెస్ ‘‘సోరోస్’’ డబ్బు ఉపయోగించింది..
- కొందరు భావప్రకటనా హక్కుని జన్మహక్కుగా భావిస్తున్నారు..
- ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Yogi Adityanath: కాంగ్రెస్పై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ‘‘జార్జ్ సోరోస్’’ డబ్బు వినియోగించిందని ఆరోపించారు. కర్ణాటకలో 4 శాతం ముస్లిం కోటాపై మాట్లాడుతూ, ఇది బాబా సాహెబ్ అంబేద్కర్కి తీవ్ర అవమానం అని అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేయడమే కాకుండా, విదేశీ డబ్బును వినియోగించారని అన్నారు. గతంలో నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని కూల్చడంపై జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యల్ని యోగి ప్రస్తావించారు. లోక్సభ ఎన్నికల్లో విదేశీ డబ్బు ప్రమేయం ఉందని, ఇందులో కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు పాల్గొన్నాయని, వీరు ఆ డబ్బు ద్వారా ఎన్నికల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపించారు. ఇది దేశద్రోహానికి సమానం అని చెప్పారు.
Read Also: Hero Karizma XMR 250: స్పోర్టీ లుక్, అధునాతన ఫీచర్లతో రాబోతున్న హీరో కరిజ్మా XMR 250
Also Read
- CJP Talks: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు.. కేంద్రం ముందు 3 డిమాండ్లు..
- Abhijeet Dipke: వాంగ్చుక్ దీక్ష విరమించినా తగ్గేదేలే.. కేంద్రానికి అభిజీత్ దిప్కే వార్నింగ్..
- Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
- Delhi Police: విద్యార్థి ఆందోళనల ఎఫెక్ట్.. పోలీసులందరి సెలవులు రద్దు..
సోరోస్తో సంబంధం ఉన్న సంస్థలు భారతదేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని బీజేపీ తరుచుగా ఆరోపిస్తుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్తో సహా ఈ సంస్థలు రూపొందించిన నివేదికలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందని విమర్శిస్తుంది. సోరోస్ నిధులతో నడిచే ఏషియా పసిఫిక్ ఫౌండేషన్లో డెమోక్రటిక్ లీడర్స్ ఫోరంతో సోనియా గాంధీకి సంబంధలు ఉన్నాయని బీజేపీ గతంలో ఆరోపించింది. ఈ సంస్థకు ఆమె కో-చీఫ్గా పనిచేశారు.
ఇదిలా ఉంటే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేని ‘‘దేశద్రోహి’’ అని విమర్శించి కామెడీ యాక్టర్ కునాల్ కమ్రాపై యోగి స్పందించారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భావప్రకటన స్వేచ్ఛని కొందరు వ్యక్తిగత దాడులకు ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. ‘‘కానీ దురదృష్టవశాత్తు, కొంతమంది ఈ స్వేచ్ఛను ఉపయోగించి దేశాన్ని ముక్కలు చేయడానికి, విభజనను విస్తృతం చేయడానికి తమ జన్మహక్కు అని భావిస్తున్నారు’’ అని యోగి అన్నారు. ప్రస్తుతం కునాల్ వ్యవహారం మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
తాజావార్తలు
-
UK: లండన్లో సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ మృతి
-
CJP Talks: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు.. కేంద్రం ముందు 3 డిమాండ్లు..
-
CM Revanth Reddy : జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు
-
DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఎస్సీకి ముహూర్తం ఖరారు..
-
Mani Ratnam: సెట్స్పైకి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్.. ఒకే ఫ్రేమ్లో సాయి పల్లవి-విజయ్ సేతుపతి!
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!