Nepal Palace Massacre: ప్రేమకు బలైన నేపాల్ రాజ కుటుంబం.. ప్యాలెస్లో ఊచకోత.. ఆ నాటి విషాద గాథ
- రాజకుటుంబాన్ని ఊచకోత కోసిన యువరాజు దీపేంద్ర..
- ప్రేమ వ్యవహారంతో నేపాల్ రాజ కుటుంబం హత్య..
- నేపాల్ రాచరికం అంతమవ్వడానికి మొదటి కారణం..
Nepal Palace Massacre: నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్కు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ నిరసనలకు తలొగ్గి ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. ఆయన మంత్రివర్గంలోని పలువురు మంత్రులు కూడా రాజీనామాలు చేశారు. ఇప్పుడు నేపాల్లో మరోసారి రాచరికం మళ్లీ వస్తుందా అనే వాదన మొదలైంది. చాలా మంది నేపాలీలు మరోసారి రాజు పాలన రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, 2001లో ఆ దేశాన్ని కుదిపేసిన రాజకుటుంబం ఊచకోత మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనే, నేపాల్లో రెండు శతాబ్ధాల రాచరికానికి అంతం పలికేలా చేసింది. 2008లో రాచరికం ముగిసి, ప్రజాస్వామ్యం వచ్చింది.
నారయణహితి ప్యాలెస్లో ఏం జరిగింది..?
Also Read
అది జూన్ 1, 2001 రాజ కుటుంబం ఖాట్మాండులోని నారాయణహితి ప్యాలెస్లో సమావేశమైంది. ప్రతీ శుక్రవారం ఇలా రాజ కుటుంబం గెటు టూ గెదర్లో కలుసుకోవడం ఒక అనవాయితీగా ఉంది. ఇలాగే ఆ రోజు కూడా రాజకుటుంబం చాలా ఉల్లాసంగా పార్టీ చేసుకున్నారు. అయితే, ఆ సాయంత్రమే రాజ కుటుంబం, తమ సొంత యువ రాజు చేతిలో ఊచకోతకు గురవుతామని ఊహించలేదు.
ఈ పార్టీకి నేపాల్ రాజు బీరేంద్ర బిర్ బిక్రమ్ షా దేశ్ హాజరయ్యారు. ఆయనే దేశాన్ని పాలిస్తున్నారు. హర్వర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అయిన బీరేంద్ర, భారత్లోని డార్జిలింగ్లో కూడా చదువుకున్నారు. ఆయన 1970లో ఐశ్వర్య రాజ్యలక్ష్మిదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం- యువరాజు దీపేంద్ర, రాజ కుమార్తె శృతి, చిన్న కుమారుడు నిరాజన్.

అంతా పార్టీలో మునిగి ఉండగా యువరాజు బీరేంద్ర(29) తాగి కనిపించారు. ఆయనను ఓ గదిలో కొద్ది సేపు విశ్రాంతి తీసుకుని, కమాండో డ్రెస్ ధరించి రైఫిల్ చేతపట్టుకుని పార్టీ జరిగే ప్రదేశానికి వచ్చారు. తన తండ్రి, రాజు అయిన బీరేంద్రను చూస్తూ, ఎలాంటి భావోద్వేగం లేకుండా అసాల్ట్ రైఫిల్తో కాల్చి చంపాడు. రాజు బీరేంద్ర చనిపోతూ, ‘‘ఏం చేశావు..?’’ అంటూ నేలపై ఒరిగిపోయాడు. దీపేంద్ర తన తల్లి ఐశ్వర్య, సోదరి శృతి, సోదరుడు నిరాజన్లతో పాటు మరో ఐదుగురిని కాల్చి చంపాడు. చివరకు తను తానున కాల్చుకున్నాడు. తుపాకీ గాయంతో కోమాలోకి వెళ్లిన దీపేంద్రను తాత్కాలికంగా రాజుగా ప్రకటించారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత జూన్ 04న మరణించాడు. దీని తర్వాత బీరేంద్ర సోదరుడు జ్ఞానేంద్ర రాజుగా బాధ్యతలు స్వీకరించారు. 2008లో రాజ్యాంగం మారి రాచరికం రద్దయ్యే వరకు ఆయనే చివరి రాజుగా ఉన్నారు.
ప్రేమ కోసమే ఉచకోత, భారత్తో సంబంధం:
ప్రభుత్వం ఈ ఊచకోతపై చేపట్టిన విచారణలో దీపేంద్ర ‘‘ప్రేమ కథ’’నే ఈ ఘటనకు కారణమని తెలిసింది. దీపేంద్ర-దేవయానిల రాణా అనే యువతిని ప్రేమించాడు. దేవయాణి నేపాల్ రాజకీయవేత్త పశుపతి షంషేర్ జంగ్ బహదూర్ రాణా కుమార్తె. ఆమె తల్లి ఉషా రాజే సింధియా. గ్వాలియర్ రాజవంశానికి చెందిన వారు. మనదేశానికి చెందిన రాజకీయనాయకులు మాధవరావు సింధియా, వసుంధర రాజేకు బంధువులు.
దీపేంద్ర, దేవయాని యూకేలో కలుసుకున్నారు. కానీ రాజ కుటుంబం ఈ ప్రేమకు అడ్డు చెప్పింది. ముఖ్యంగా దీపేంద్ర తల్లి, రాణి అయిన ఐశ్వర్య ఈ సంబంధాన్ని ఒప్పుకోలేదు. ఒక వేళ దేవయాణిని పెళ్లి చేసుకుంటే యువరాజు హోదాను వదులుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం. వేరే రాజ వంశానికి చెందిన అమ్మాయితో కొడుకు దీపేంద్ర వివాహం జరిపించాలని ఐశ్వర్య భావించింది. భారతదేశానికి చెందిన రాజకుటుంబంతో సంబంధం కలుపుకుంటే, ఆ దేశ ప్రభావం తమపై ఎక్కువగా ఉంటుందని రాజ కుటుంబ భయపడినట్లు మరో కారణంగా చెబుతారు. ప్రేమ, రాజకీయం, అధికారం అన్ని కలిసిన నేపాల్ రాజ కుటుంబం ఊచకోత ప్రపంచంలోనే ఆ రోజుల్లో సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!
-
Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
-
Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
-
Bangladesh: బంగ్లాదేశ్ ఎయిర్ఫోర్స్లో తాలిబాన్లు.. బయటపడ్డ పాకిస్తాన్ మూలాలు..
-
Urban Heat Crisis: వరల్డ్ బ్యాంకు హెచ్చరిక.. 2050 నాటికి 700 శాతం పేదలు వేడికి బలి
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!