విజయనగరం జిల్లా జామి మండలం భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం వెంటనే తెరిపించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతు మహాజన సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామన్నారు. భీమసింగిలో ఉత్పత్తి చేసిన చక్కెరను వివిధ హిందూ దేవాలయాల్లో ప్రసాదానికి వాడేందుకు వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ విధంగా…
ఈరోజు ఏపీలో జుడిషియరీ వర్సెస్ ఎగ్జిక్యూటీవ్ అనే అంశంపై ఆంధ్రా విజ్జమ్ ఫెస్టివల్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. అందులో సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ మాట్లాడుతూ… మెజారిటీ వాళ్ళు నిర్ణయించేది చట్టం కాదు. ఇలాంటి నిర్ణయాలను సరి చేసేందుకే న్యాయ వ్యవస్థ ఉంది. వ్యవస్థలో వ్యక్తి పూజ మంచిది కాదని అంబేద్కర్ అన్నారు. ఆందోళనలు, సత్యాగ్రహాలు లేకుండా చూడాలి అయితే.. ఇప్పుడు అలా జరగడం లేదు. రైతులు వందల రోజులు ఆందోళనలు చేస్తున్నారు వారిని పట్టించుకోవడం లేదు…