చెన్నైలోని మెరీనా బీచ్ దగ్గర ఎయిర్ షోలో తొక్కిసలాట జరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఎయిర్ షో చూసేందుకు జనం పోటెత్తారు. దీంతో.. మెరీనా బీచ్ మొత్తం జనసంద్రంగా మారింది. బీచ్ కు వచ్చే రోడ్లు, మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలోనే మెరీనా బీచ్ రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
గుజరాత్ దారుణం చోటు చేసుకుంది. ఆయుర్వేదిక్ సిరప్ తాగి ఐదుగురు మరణించగా.. మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గురువారం గుజరాత్లోని ఖేడా జిల్లా నడియాడ్లో జరిగింది.ఆ సిరప్లో విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్ కలిసినట్టు బాధితుల వైద్య పరీక్షలో వెల్లడైంది. దీంతో గ్రామస్తుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. పోలీసులు సమాచారం ప్రకారం.. పట్టణంలోని ఓ షాప్ కల్మేఘాసవాసవ అరిష్ట అనే పేరుతో ఆయుర్వేదిక్ సిరప్ను విక్రయించగా..…