కొంతకాలం నుంచి పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడంటూ విమర్శలు ఎదుర్కొన్న రిషభ్ పంత్.. ఇంగ్లండ్తో జరుగుతోన్న ఐదో టెస్ట్ మ్యాచ్లో మాత్రం అదరగొట్టేశాడు. వరుస వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు.. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగాడు. అదే జోష్ను రెండో ఇన్నింగ్స్లోనూ కొనసాగించాడు. ఈ క్రమంలోనే అతడు ఓ అరుదైన రికార్డ్ని సాధించగలిగాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 146 పరుగులు చేసిన పంత్.. సెకండ్ ఇన్నింగ్స్లో 57 పరుగులు సాధించాడు. తద్వారా.. ఒకే టెస్టులో శతకం, అర్దశతకం సాధించిన…