Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Why Enforcement Directorate Involved In Tollywood Drugs Case

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ ఎందుకు ఇన్వాల్ అయ్యిందంటే ?

Published Date :August 26, 2021 , 12:45 pm
By Prakash
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ ఎందుకు ఇన్వాల్ అయ్యిందంటే ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ సెలెబ్రిటీల పేర్లు ఇందులో బయటకు వచ్చాయి. 2017 లోనే ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు రవితేజ, ఛార్మి, రకుల్, రానా, తరుణ్, పూరి జగన్నాథ్, నవదీప్, ముమైత్ ఖాన్, నందు, శ్రీనివాస్ తదితరుల నుంచి శాంపిల్స్ ను సేకరించి డ్రగ్స్ నిర్ధారణ పరీక్ష కోసం ల్యాబ్ కు పంపారు. ఆ తరువాత ఈ కేసులో వేగం తగ్గిపోయింది. తాజాగా ఈడీ సెలెబ్రెటీలకు నోటీసులు పంపడంతో మరోసారి డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు ఈ సెలెబ్రిటీలంతా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.

అయితే ఇది డ్రగ్స్ కేసు కదా. మత్తుపదార్థాలకు సంబంధించిన కేసును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేపట్టాలి. మరి ఇందులో ఈడీ ప్రమేయం ఎందుకు ఉంది ? వారికి ఈడీ ఎందుకు నోటీసులు జారీ చేసింది ? అనే డౌట్ రావొచ్చు. అప్పట్లో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పలువురు విదేశీయులను ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కింగ్ పిన్ కెల్విన్, మైక్ కమింగా, విక్టర్ లాంటి సూత్రధారులను అరెస్టు చేయడంతో టాలీవుడ్ డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. అయితే అరెస్ట్ అయిన వీళ్లంతా విదేశాలకు సంబంధించిన పౌరులు. కానీ గోవా డ్రగ్ మాఫియాతో వీరందరికీ సత్సంబంధాలు ఉన్నాయి. సౌతిండియాలోని సినిమా తారలు, ఐటీ కంపెనీలో ఉద్యోగులు, స్కూలు, కాలేజీ పిల్లలను టార్గెట్ చేస్తూ ఈ డ్రగ్ మాఫియా కొనసాగుతోంది.

Also Read

  • Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
  • NBK - Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే..
  • Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
  • Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు

Read Also : మిస్టర్ బైడెన్… చెప్పు తెగుద్ది ఎదవ : నిఖిల్

ఎండిపిఎస్ యాక్ట్ ప్రకారం డ్రగ్స్ నివారణ కోసం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో మాత్రమే కాకుండా అన్ని దర్యాప్తు సంస్థలు ఇన్వాల్వ్ అవ్వచ్చు. కానీ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కేవలం రాష్ట్ర పరిధిలో ఉన్న ఎక్సైజ్ శాఖ, సిట్ దర్యాప్తు లకే పరిమితం చేయడంతో హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. విదేశీయులుగా ఉన్న పౌరులు ఈ కేసులో నిందితులుగా ఉండడంతో మనీలాండరింగ్ పెద్ద ఎత్తున జరిగి ఉండొచ్చని ఆరోపణలు వచ్చాయి. విదేశాలలో తయారవుతున్న డ్రగ్స్ కు కింగ్ పిన్ లు హైదరాబాద్ లో మకాం వేశారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఈడీ, సెంట్రల్ ఎకానామిక్స్ ఇంటలిజెన్స్ బ్యూరోతో దర్యాప్తు చేయించాలని కోర్ట్ లో పిటిషన్లు దాఖలయ్యాయి. అలా ఈ కేసులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది.

2020 నవంబర్ లో ఈ విషయంపై సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్ కమిషనర్ కు ఈడి లేఖ రాసింది. 2017లో ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన 12 ఎఫ్ఐఆర్లు, చార్జిషీట్ లు ఇవ్వాలని ఎక్సైజ్ కమిషనర్ కు ఈడీ లేఖ రాసింది. అయితే ఎక్సైజ్ శాఖ నుండి ఎలాంటి సమాచారం రాలేదని గతంలోనే ఈడీ కోర్టుకు తెలిపింది. ఎక్సైజ్ శాఖ సేకరించిన స్టేట్మెంట్లు, డిజిటల్ పరికరాలు, సాక్ష్యాలు, రిపోర్ట్ కాపీలు ఇవ్వాలని గతంలోనే హైకోర్టును కోరింది ఈడి. రాహుల్ సింఘానియా ఈడీ డెప్యూటీ డైరెక్టర్ కోర్ట్ లో అఫిడవిట్ దాఖలు చేశాడు. తాజాగా ఎక్సైజ్ శాఖ నుండి కేసుకు సంబంధించిన వివరాలు అందటంతో రంగంలోకి ఈడి రంగంలోకి దిగింది. ఈ కేసు తరువాత ఎలాంటి మలుపులు తిరుగుతుందా ? అన్న విషయం ఆసక్తికరంగా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Drugs
  • Enforcement Directorate
  • NCB
  • Tollywood
  • Tollywood Drugs Case

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions