పశ్చిమబెంగాల్లోని దుర్గాపూర్లో ఒడిశాకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. అర్ధరాత్రి విద్యార్థినులు ఎందుకు బయటకు వెళ్తున్నారని.. ప్రైవేటు యాజమాన్యాలు శ్రద్ధ తీసుకోవాలని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి.