Ganjai : ట్రాలీ బ్యాగుల్లో 20 ప్యాకెట్ల గంజాయి లభ్యం
- సముద్రంలోనే పండే హైడ్రోఫోనిక్ గంజాయి
- అత్యంత కిక్కు ఇచ్చే గంజాయిల్లో ఇదే నంబర్ వన్
- దాని విలువ దాదాపు రూ. 13 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganjai : గంజాయి, డ్రగ్స్పై పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా.. స్మగ్లర్లు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తమ పని తాము చేసుకుపోతాం అనేలా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ గంజాయి విపరీతంగా దోరుకుతున్నా.. కస్టమర్ల కోసం విదేశాల నుంచి కూడా టాప్ రేటెడ్ గంజాయిని తీసుకు వస్తున్నారు. అలా విమానంలో గంజాయి తెచ్చిన మహిళ పోలీసులకు చిక్కింది. మరోవైపు ధూల్పేట్ స్మగ్లర్లు రూట్ మార్చి.. గంజాయి బదులుగా డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఓ మహిళ గంజాయి బ్యాగ్తో దిగింది. మహిళ తీరుపై అనుమానం వచ్చిన డైరెక్ట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్..DRI అధికారులు తనిఖీ చేశారు. దీంతో ఆమె ట్రాలీ బ్యాగుల్లో 20 ప్యాకెట్ల గంజాయి లభ్యమైంది… అదేంటీ మన దగ్గరే గంజాయి విపరీతంగా లభ్యమవుతున్నా.. ఆమె విదేశాల నుంచి గంజాయి తీసుకు రావడమేంటి అనుకుంటున్నారా? ఆమె తెచ్చింది సాదాసీదా గంజాయి కాదు.
Read Also : Srushti Ivf Center : బయట పడుతున్న ‘సృష్టి’ లీలలు
Also Read
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
- Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
దాన్ని హైడ్రోఫోనిక్ గంజాయి అంటారు. ఇది కేవలం సముద్రంలోనే పండుతుంది. సింగపూర్, మలేషియా లాంటి ప్రాంతాల్లోనే ఇది దొరుకుతుంది. దీని స్పెషాలిటీ కూడా వేరుగా ఉంటుంది. అత్యంత కిక్కు ఇచ్చే గంజాయిల్లో ఇదే నంబర్ వన్ అని చెబుతుంటారు. దీన్ని ఒక్కసారి తీసుకుంటే చాలు రోజంతా అదే మత్తు ఉంటుందంటున్నారు. అలాంటి గంజాయినే మహిళ తీసుకు వచ్చింది. ఆమెకు తీసుకు వచ్చిన హైడ్రోఫోనిక్ గంజాయి 13 కిలోలు ఉంటుందని అధికారులు తెలిపారు. దాని విలువ దాదాపు రూ. 13 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. మహిళ ఆ గంజాయిని బ్యాంకాక్ నుంచి తీసుకు వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు..
మరోవైపు హైదరాబాద్లో గంజాయి స్మగ్లింగ్కు ధూల్పేట్ ఫేమస్. కానీ ధూల్పేట్ స్మగర్లు మాత్రం ఇప్పుడు రూట్ మార్చారు. గంజాయి అమ్మకాలు తక్కువ చేసి డ్రగ్ పెడ్లింగ్ షురూ చేశారు. ఆపరేషన్ ధూల్పేట్లో భాగంగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కేజీ 500 గ్రాముల గంజాయితోపాటు 5 జెల్లీ LCD, 0.11 గ్రాముల డోర్స్, 12.2 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురిపైనా కేసులు నమోదు చేశారు. అరెస్ట్ అయిన వారిని మహేందర్ సింగ్, అర్జున్ సింగ్, ఎం. అనిల్ కుమార్గా గుర్తించారు. హరి ఓం శర్మ, జోడి కృష్ణ, సాజిల్, సుమితా శ్రీధర్ సావెంట్, రోహిత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు…
తాజావార్తలు
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!