Execution: నిమిషాప్రియా మాత్రమే కాదు, మరో దేశంలో ముగ్గురు భారతీయులకు ఉరిశిక్ష..
- నిమిషా ప్రియా లాగే ఇండోనేషియాలో మరో ముగ్గురికి ఉరిశిక్ష..
- డ్రగ్ స్మగ్లింగ్ కేసులో ఇరుకున్న భారతీయులు..
- దౌత్యపరమైన ఒత్తిడి ద్వారా విడిపించే ప్రయత్నం..
- యెమెన్లో ఈ నెల 16న నిమిషా ప్రియాకు శిక్ష అమలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Execution: యెమెన్ దేశంలో కేరళ నర్సు నిమిషా ప్రియాకు జూలై 16న ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. అయితే, ఈ శిక్ష నుంచి ఆమెను తప్పించేందుకు, షరియా చట్టాల ప్రకారం, బాధితుడి కుటుంబానికి ‘‘బ్లడ్ మనీ’’ కింద పరిహారం ఇచ్చేందుకు ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. జూలై 14న భారత సుప్రీంకోర్టు ముందుకు ఈ కేసు విచారణ రానుంది. యెమెన్ దేశస్తుడి నుంచి తన పాస్పోర్టు తీసుకునేందుకు, నిమిషా ప్రియా మత్తు మందు ఇచ్చింది. ఇది వికటించి అతను మరణించడంతో, ఆమెకు అక్కడి చట్టాలు ఉరిశిక్ష విధించాయి.
ఇదిలా ఉంటే మరో దేశంలో కూడా ముగ్గురు భారతీయులకు ఉరిశిక్ష విధించబడింది. ఇండోనేషియాలోని కోర్టు వీరికి మరణశిక్ష విధించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో దోషులుగా తేలిన తర్వాత ఇండోనేషియా చట్టాల ప్రకారం శిక్షను విధించారు. ఈతీర్పు అక్కడి హైకోర్టులు కూడా సమర్థించాయి. రాజు ముత్తుకుమరన్, సెల్వదురై దినకరన్, గోవిందసామి విమల్కందన్లు ప్రస్తుతం జైలులో ఉన్నారు.
Also Read
- Nashik Forced Conversion: బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్టు
- DMK vs AIADMK: డీఎంకె-ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం.. విజయ్ ఎమ్మెల్యేల హెచ్చరిక
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
Read Also: Chhangur Baba: ఛంగూర్ బాబాకు పాక్ ఐఎస్ఐతో సంబంధాలు..
అయితే, ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని ఇండోనేషియాలోని భారత రాయబారి సందీప్ చక్రవర్తి కోరారు. ఓడ కెప్టెన్, సిబ్బందితో సహా అందరు సాక్షుల్ని మరోసారి క్షుణ్ణంగా విచారించాలని కోరారు. ఇండోనేషియా న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకుం ఉందని, దర్యాప్తులో కొన్ని తేడాలను చూశామని, మొబైల్ ఫోన్ రికార్డులతో సహా అన్ని ఆధారాలను పరిశీలించలేదని చెప్పారు.
గత ఏడాది జూలైలో ఇండోనేషియాలోని రియావు దీవులలోని కరీమున్ ద్వీపం సమీపంలో సింగపూర్ జెండాతో ఉన్న ఓడ నుండి భారత పౌరులైన రాజు ముత్తుకుమరన్, సెల్వదురై దినకరన్ , గోవిందసామి విమల్కందన్లను అరెస్టు చేశారు. ఈ ముగ్గురూ మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపించారు. అక్కడి స్థానిక కోర్టు వీరికి మరణశిక్ష విధించింది. హైకోర్టు కూడా వీరి శిక్షని సమర్థించింది. రాబోయే రోజుల్లు వీరిని కూడా ఉరి తీసే అవకాశం ఉంది. అరెస్ట్ నుంచి విచారణ ప్రక్రియ వరకు ఇండోనేషియా అధికారులు నిర్లక్ష్యం వహించారిన భారత దౌత్యకార్యాలయం ఆరోపించింది. వీరి ముగ్గురిని విడిపించేందుకు భారత్ దౌత్య మార్గాల ద్వారా ఒత్తిడి తెస్తోంది.
తాజావార్తలు
-
Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
-
Laila: జ్యోతికకు తెలిస్తే చంపేస్తుంది.. సూర్య పై ఓపెన్ కామెంట్స్ చేసిన లైలా
-
IPL Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో.. వరుసగా ఐదు మ్యాచ్లలో ఐదు అర్ధ సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు అతనే..
-
PEDDI North America Bookings : పెద్ది ఓవర్సీస్.. నార్త్ అమెరికా బుకింగ్స్ ఓపెన్.. 30 నిమిషాల్లో ఊచకోత
-
Nashik Forced Conversion: బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్టు