Ganja Smuggling : కేసులో సీజైన గంజాయి అమ్మకం.. తనిఖీల్లో బయటపడ్డ కానిస్టేబుల్ నిర్వాకం
- గంజాయి కేసులో తాండూర్ ఎక్సైజ్ కానిస్టేబుల్
- తనిఖీల్లో పట్టుకున్న షాద్ నగర్ పోలీసులు
- 1.5 కిలోల గంజాయి పట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganja Smuggling : షాద్ నగర్ లో పోలీసులు సాధారణ తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ యువకుడిని అదుపులోకి తీసుకోగా అతని వద్ద కిలోన్నర గంజాయి లభించింది.. తీగ లాగితే డొంక కదిలినట్టు తాండూరు ఎక్సైజ్ కార్యాలయంలో సీజ్ అయిన గంజాయిని బయటికి తీసి ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ దీనిని తన బంధువు ద్వారా విక్రయించేతువు తీసుకు వెళుతుండగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈనెల 4వ తేదీన పట్టణంలోని ఫరూక్ నగర్ యాదవ కాలనీ ఈద్గా వద్ద స్థానిక ఎస్సై దేవరాజ్ వాహనాల తనకి చేస్తుండగా అంజద్ (32) అనే యువకుడు చేతిలో కవర్ తీసుకొని అనుమానాస్పదంగా వెళుతుండగా పోలీసులు అతని వద్ద సోదా చేశారు. చేతి కవర్ లో గంజాయి వాసనను పసిగట్టి ఎస్సై దేవరాజ్ తదితర సిబ్బంది అతని అదుపులోకి తీసుకున్నారనీ సిఐ విజయ్ కుమార్ వెల్లడించారు.
RCB Stampede: తొక్కిసలాట ఘటన.. ఆర్సీబీ యాజమాన్యంపై కేసు నమోదు..
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
వికారాబాద్ జిల్లా తాండూర్ ఎక్సైజ్ కార్యాలయంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గులాం సుల్తాన్ అహ్మద్ (52) సీజ్ చేసి ఉంచిన గంజాయిని బయటకు తీసి తన వరుసకు కుమారుడైన అంజద్ కు అమ్మాలని అందజేశాడనీ పోలీసులు పేర్కొన్నారు. ఈ గంజాయిని అమ్మే క్రమంలో అంజాత్ షాద్ నగర్ పోలీసులకు చిక్కినట్లు తెలిపారు. కంచె చేను మేసిన చందంగా తప్పుచేసి ఇరుక్కున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ గులాం సుల్తాన్ అహ్మద్, అంజద్ ఇరువురులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 75 వేల విలువగల ఈ గంజాయితోపాటు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
నిందితులు జల్సాలకు అలవాటు పడి సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలని తన వరుసకు బాబాయి అయిన గులాం సుల్తాన్ అహ్మద్ తో కలిసి గంజాయి విక్రయాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ కేసును శంషాబాద్ డిసిపి రాజేష్ అడిషనల్ డీసీపీ పూర్ణచందర్, షాద్ నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై దేవరాజును అభినందిస్తూ వారికి తగిన రివార్డు కోసం పై అధికారులకు సిఫార్సు చేయడం జరిగిందని సిఐ విజయకుమార్ తెలిపారు..
Physical Harassment : వికారాబాద్లో దారుణం.. మైనర్ బాలికపై లైంగిక దాడి..!
తాజావార్తలు
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!