దేశంలో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు దగ్ధమవ్వడం, మరణాలు కూడా సంభవించడంతో.. కేంద్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఈ వాహనాల ప్రమాదాల వెనుక అసలు కారణాలేంటో వెలికి తీయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో, డీఆర్డీవో రంగంలోకి దిగింది. ఎక్కడైతే ప్రమాదాలు చోటు చేసుకున్నాయో, ఆ ప్రాంతాలకు వెళ్ళి కొన్ని సాక్ష్యాల్ని సేకరించింది. తొలుత ఎండాకాలం సీజన్ వల్ల ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, అందులో వాస్తవం లేదని ప్రాథమిక విచారణలో భాగంగా డీఆర్డీవో…