Social media rules: పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్స్కి తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి చేయబోతోంది కేంద్రం. శుక్రవారం కేంద్రం ప్రచురించిన ‘‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023’’ ముసాయిదా నిబంధలన ప్రకారం.. 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయడానికి తల్లిదండ్రుల సమ్మతిని తప్పనిసరి చేసింది. ఫిబ్రవరి 18 వరకు వచ్చిన అభ్యంతరాల ఆధారంగా ముసాయిదాలో మార్పులు చేర్పులు చేసి చట్టాన్ని తీసుకురాబోతోంది.