Telangana DCA: తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన శ్రేసన్ ఫార్మా మే నెలలో తయారు చేసిన ‘కోల్డ్రిఫ్ సిరప్’ (Coldrif Syrup) ను వాడటం వెంటనే ఆపేయాలని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) ప్రజలను హెచ్చరించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో అనేక మంది పిల్లల మరణానికి ఈ సిరప్ వినియోగంతో సంబంధం ఉందన్న నివేదికల నేపథ్యంలో.. బ్యాచ్ SR-13 కు చెందిన ఈ ఔషధంలో మూత్రపిండాల వైఫల్యానికి కారణమయ్యే డైథిలిన్ గ్లైకాల్ (DEG) అనే విషపూరిత పదార్థం కలుషితమై…
Coldrif Syrup: మధ్యప్రదేశ్లో చింద్వారాలో కోల్డ్రిఫ్ సిరప్ కారణంగా 11 మంది చిన్నారులు మరణించిన సంఘటన సంచలనంగా మారింది. చిన్నారులకు ఈ సిరప్ని రాసిన డాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆదివారం తెలిపారు. చనిపోయిన చిన్నారుల్లో ఎక్కువ మంది పరాసియాలో శిశువైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ ప్రవీణ్ సోని క్లీనిక్లో చికిత్స తీసుకున్నారు.