‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ లాంటి హిట్ మూవీతో తెలుగు వారికి కూడా బాగానే పరిచయమైన దర్శకుడు సెల్వరాఘవన్. అయితే, కోలీవుడ్ లో ఆయన ఇంటెన్స్ మూవీస్ కి బోలెడు క్రేజ్ ఉంది. అక్కడ మంచి డిమాండ్ ఉన్న డైరెక్టర్ ఆయన. అయితే, కొన్నాళ్ల క్రితం తెర మీద కనిపించబోతున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. నటుడిగా సెల్వరాఘవన్ తొలి చిత్రం ‘సాని కాయిదమ్’లో కీర్తి సురేశ్ కనిపించబోతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నందుకు ఆమె…
కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీ ఇప్పటికే స్ట్రయిట్ తెలుగు సినిమాలలో నటించేశారు. విజయ్ ఆంటోని సైతం తెలుగులో తన చిత్రాలకు లభిస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని స్ట్రయిట్ తెలుగు సినిమాలో తప్పకుండా నటిస్తానని చెబుతున్నాడు. ఇక ఇటీవల విజయ్ తో తెలుగు సినిమా తీయబోతున్నట్టు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా తెలుగు సినిమాలో నటించడానికి పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. నిజానికి చాలా కాలం తమిళచిత్రసీమకే…
తమిళ స్టార్ నటుడు ధనుష్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘జగమే తందిరం’. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ చిత్రాన్ని వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మించారు. తాజాగా ‘జగమే తందిరం’ ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. గ్యాంగ్స్టర్ పాత్రలో ధనుష్ మాస్ లుక్లో అదరగొట్టాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ నటుడు జేమ్స్ కాస్మో, సంచన నటరాజన్, జోజు జార్జ్, కలైరసన్, వడివక్కరసి కీలకపాత్రల్లో…
తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన “జగమే తందిరం” చిత్రం ఓటిటిలో విడుదల కానున్న విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూన్ 18న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ డేట్ ను ప్రకటించారు నిర్మాతలు. జూన్ 1న “జగమే తందిరం” ట్రైలర్ విడుదల కానుందని ప్రకటిస్తూ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. “జగమే తందిరం” 2020లో విడుదల కావాల్సి ఉంది కాని కోవిడ్ -19…
ధనుష్, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషించిన ‘జగమే తంత్రం’ మూవీ మొత్తానికీ జూన్ 18న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా నిజానికి వేసవి కానుకగా థియేట్రికల్ రిలీజ్ కావాల్సి ఉంది. ఈ లోగా వైనాట్ స్టూడియోస్ కు థియేటర్ల యాజమాన్యంకు మధ్య ఏర్పడిన చిన్నపాటి అగాథంతో ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఈ లోగా కరోనా సెకండ్ వేవ్ సైతం బలపడటంతో…
ధనుష్ హీరోగా నటించిన ‘కర్ణన్’ సినిమా తెలుగు రీమేక్ హక్కులను బెల్లంకొండ సురేశ్ దక్కించుకున్నారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ సినిమా కోవిడ్ నిబంధనల ప్రకారం థియేటర్లలో ప్రదర్శించినా అద్భుతమైన విజయాన్ని సాధించటం విశేషం. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో కలైపులి ధాను నిర్మించిన ఈ చిత్రంలో ధనుష్ సరసన రాజీషా విజయన్ హీరోయిన్ గా నటించారు. లాల్, నటరాజసుబ్రహ్మణ్యం, యోగిబాబు, లక్ష్మీప్రియ ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. వి…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం ‘జగమే తందిరం’. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ కెరీర్లో 40వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. ‘జగమే తందిరం’లో ధనుష్ సురులి అనే గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నాడు. ‘జగమే తందిరం’ చిత్రం థియేటర్లోనే…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉన్నారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానున్న మూవీ ‘ది గ్రే మ్యాన్’ సినిమాలో ధనుష్ ఓ కీలక యాత్రలో నటిస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామా షూటింగ్ నిమిత్తమై ‘ది గ్రే మ్యాన్’ మూవీ టీంతో కాలిఫోర్నియాలో ఉన్నారు ధనుష్. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ధనుష్ పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ యాక్షన్-డ్రామా చిత్రం 2009లో మార్క్…
కోలీవుడ్లో ధనుశ్ దూకుడు ముందు ఏ హీరో నిలబడలేక పోతున్నారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రత్యేకించి కథ,కథనాల విషయంలో ధనుష్ కి మంచి పట్టు ఉంది. ఆరంభం నుంచి ప్రయోగాలకి, వైవిధ్యానికి మారుపేరుగా ముందుకు సాగుతున్నాడు ధనుష్. ఇక ఇటీవల కాలంలో ఈ విషయంలో మరింతగా దూకుడు పెంచాడు. ఫలితమే ‘మారి 2’, ‘అసురన్’, ‘పట్టాస్’, ‘కర్ణన్’ వంటి సినిమాలు సాధించిన విజయాలు. ఇతర హీరోలతో పోటీపడకుండా తనదైన ప్రత్యేకతను చాటుతూ అటు కమర్షియల్ విజయాలు సాధిస్తూనే…