భారతదేశ శాశ్వత సంస్కృతి, ఆధ్యాత్మికత, విశ్వాసానికి ప్రతీక అయిన మహా కుంభమేళా సంగం నగరం ప్రయాగ్రాజ్లో నేటి నుంచి ప్రారంభమైంది. ఈరోజు పౌష్ పూర్ణిమ అమృత స్నానం. గంగా, యమున, సరస్వతి (అదృశ్య) నదుల సంగమంలో ఉదయం నుంచి భక్తులు స్నానాలు చేస్తున్నారు. ఈరోజు దాదాపు కోటి మంది భక్తులు గంగాస్నానం చేస్తారని చెబుతున్నారు. కాగా.. ఈ కుంభమేళాలో పలువురు బాబాలు అందరి దృష్టిని ఆకర్శిస్తున్నారు. వారి గురించి తెలుసుకుందాం..