Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన ఎంపీ సంజయ్ సింగ్ని ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా ఈ రోజు ఆయనకు కోర్టు అక్టోబర్ 10 వరకు 5 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో అంతకుముందు ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్తో పాటు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరు జైలులో ఉన్నారు. బుధవారం రోజు ఎంపీ సంజయ్ సింగ్…
ఢిల్లీ మద్యం పాలసీలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియా, ఇతర నిందితుల రూ.52 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసినట్లు విషయం తెలిసిన వ్యక్తులు తెలిపారు.
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో మనీస్ సిసోడియాకు మరోసారి చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ న్యాయస్థానం నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్, అవినీతికి పాల్పడినట్లు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియా అభియోగాలను ఎదుర్కొంటున్నారు.
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిఫ్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఈ రోజుతో కస్టడీ ముగియడంతో మనీస్ సిసోడియాను సీబీఐ అధికారులు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రధాని నరేంద్రమోదీకి జైలు నుంచే లేఖ రాశారు. సీఎం కేజ్రీవాల్ లాగా సిసోడియా కూడా ప్రధాని విద్యార్హతపై ప్రశ్నలు లేవనెత్తారు. మనీస్ సిసోడియా రాసిన లేఖను సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ లేకలో సిసోడియా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. భారత దేశానికి విద్యావంతుడైన ప్రధాని కావాలని అన్నారు.
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాను ఈడీ విచారిస్తోంది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సౌత్ గ్రూప్ తో కుమ్మక్కు అయి 5 శాతం నుంచి 12 శాతం మార్జిన్ పెంచినట్లుగా తేలింది. ఆధారాలు దొరక్కుండా అన్ని డిజిటల్ ఫోన్లను ధ్వంసం చేశారు. ఓబెరాయ్ హోటల్ కేంద్రంగా ఇవన్నీ జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. లిక్కర్ కేసుకు సంబంధించి కీలక డిజిటల్ సాక్ష్యాలను మాయం చేశారు. లిక్కర్ స్కాం సమయంలో 14…
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరో 5 రోజుల కస్టడీని పొడగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మరో 7 రోజులు సిసోడియాను విచారించేందుకు సమయం కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టును కోరింది. అయితే కోర్టు మరో 5 రోజుల కస్టడీకి అప్పగించింది.