Shah Rukh Khan: ఆర్యన్ ఖాన్ షోపై ఐఆర్ఎస్ అధికారి ఫైర్.. షారుఖ్-గౌరీ సహా నెట్ఫ్లిక్స్పై రూ.2 కోట్ల పరువు నష్టం దావా..
- ఆర్యన్ ఖాన్ షోపై ఐఆర్ఎస్ అధికారి ఫైర్
- షారుఖ్-గౌరీ సహా నెట్ఫ్లిక్స్పై రూ.2 కోట్ల పరువు నష్టం దావా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన నెట్ఫ్లిక్స్ షో “ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్”కు వ్యతిరేకంగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారి సమీర్ వాంఖడే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ షోపై దాఖలు చేసిన పరువు నష్టం దావాలో, వాంఖడే షో నిర్మాతలు, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ యజమానులు, నటుడు షారుఖ్ ఖాన్, అతని భార్య గౌరీ ఖాన్, అలాగే నెట్ఫ్లిక్స్, ఇతరుల నుండి రూ. 2 కోట్ల నష్టపరిహారం కోరాడు. ఈ సిరీస్లో తన పాత్ర చిత్రీకరణ తప్పుడు, దురుద్దేశపూరితమైన, పరువు నష్టం కలిగించేలా ఉందని వాంఖడే ఆరోపించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మరోసారి చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారు.
Also Read:Kishan Reddy: సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వాఖ్యలు..
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ యాజమాన్యంలోని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్, ఇతర పార్టీలపై ఐఆర్ఎస్ అధికారి సమీర్ వాంఖడే పరువు నష్టం దావా వేశారు. ఈ సిరీస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల ప్రతిష్టను దెబ్బతీస్తుందని, చట్ట అమలు సంస్థలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని సమీర్ వాంఖడే ఆరోపించాడు. ఈ సిరీస్లో సమీర్ను పోలి ఉండే డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఒక పార్టీపై దాడి చేసే సన్నివేశం ఉంది. ఇది 2021 క్రూయిజ్ రైడ్ కు సంబంధించింది. ఈ సన్నివేశం ఉద్దేశపూర్వకంగా పక్షపాతంతో, పరువు నష్టం కలిగించేలా ఉందని సమీర్ పేర్కొన్నాడు.
సమీర్ వాంఖడే, ఆర్యన్ ఖాన్ కేసు ఇప్పటికీ బాంబే హైకోర్టులో, ముంబైలోని ప్రత్యేక NDPS కోర్టులో పెండింగ్లో ఉంది. ఈ సిరీస్లోని ఒక కలతపెట్టే సన్నివేశాన్ని సమీర్ ఎత్తి చూపాడు. అందులో ఒక పాత్ర “సత్యమేవ జయతే” అని చెప్పి వెంటనే అసభ్యకరమైన సంజ్ఞ చేస్తుంది. దీనిని అతను జాతీయ చిహ్నానికి అవమానంగా, 1971 నాటి జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపించాడు.
ఈ సిరీస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, భారత శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్లను ఉల్లంఘిస్తోందని, అశ్లీల విషయాలను ఉపయోగించడం ద్వారా జాతీయ మనోభావాలను కించపరిచే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ సమీర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్లో, రూ. 2 కోట్ల పరిహారం కోరుతూ, క్యాన్సర్ రోగుల చికిత్స కోసం టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇవ్వాలని ప్రతిపాదించాడు.
Also Read:OG 2 : ఓజీ 2లో సాహో.. స్పందించిన సుజిత్
2021 లో ఏం జరిగింది?
సమీర్ వాంఖడే, ఆర్యన్ ఖాన్ మధ్య గొడవ అక్టోబర్ 2, 2021న జరిగింది. ఆ సమయంలో, సమీర్ నేతృత్వంలోని NCB, ముంబై సమీపంలోని ఒక క్రూయిజ్ షిప్లో ఒక పార్టీపై దాడి చేసింది. ఆ నౌకలో కొంతమంది వ్యక్తులు మాదకద్రవ్యాలను కలిగి ఉన్నట్లు తేలింది. ఆర్యన్ ఖాన్, ఇతరులను NDPS చట్టం కింద అరెస్టు చేశారు, కానీ ఆధారాలు లేకపోవడంతో NCB తరువాత వారిని నిర్దోషిగా విడుదల చేసింది. తదనంతరం, వారిపై ఉన్న అభియోగాలను తొలగించారు. NDPS కోర్టు వారి పాస్పోర్ట్లను తిరిగి ఇచ్చింది.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!