AAP: “లిక్కర్ స్కామ్” టూ “శీష్ మహల్”.. ఢిల్లీలో ఆప్ ఘోర పరాజయానికి కారణాలు ఇవే..
- లిక్కర్ స్కామ్ టూ శీష్ మహల్..
- ఢిల్లీలో ఆప్ ఘోర పరాజయానికి కారణాలు..
- కేజ్రీవాల్ సర్కార్పై పెరిగిన వ్యతిరేకత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. ఆప్ అధినేత కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం అతిశీ మార్లేనా వంటి వారితో పాటు ఆ పార్టీకి చెందిన సౌరభ్ భరద్వాజ్, సోమ్నాథ్ భారత, సత్యేందర్ జైన్ వంటి వారు వెనకంజలో ఉన్నారు. పదేళ్ల పాటు ఢిల్లీని పాలించిన ఆప్కి ఈ ఫలితాలు రుచించడం లేదు. ఇదే సమయంలో, దాదాపుగా 27 ఏళ్ల పాటు అధికారం కోసం శ్రమిస్తున్న బీజేపీ కల నెరవేరబోతోంది. అయితే, ఆప్ ఘోరపరాజయానికి అది చేసుకున్న స్వయంకృతాపరాధమే కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఆప్ ఓటమికి కారణాలు ఇవే:
Also Read
- Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
ప్రభుత్వ వ్యతిరేకత:
2015, 2020లో గెలిచి వరసగా ఆప్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. విద్య , ఆరోగ్యం, విద్యుత్, నీటి సబ్సిడీలతో తన పదవీ కాలంలో ఓటర్లను సంతృప్తి పరిచింది. అయితే, రాజధానిలో గాలి నాణ్యత, యమునా కాలుష్యం ఢిల్లీ ఓటర్లలో ఆప్ పట్ల వ్యతిరేకతను పెంచాయి. కేంద్రంలోని బీజేపీ తమ ప్రభుత్వానికి పనిచేసేందుకు అడ్డంకులు సృష్టిస్తోందని పలుమార్లు కేజ్రీవాల్ ఆరోపించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండటంతో పాటు కేంద్రంలో బీజేపీ ఉండటం, ఢిల్లీలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులే ఎంపీలుగా ఉండటంతో ఈసారి ఢిల్లీ ఓటర్లు బీజేపీకి మద్దతు తెలిపారు.
శీష్ మహల్:
ఆప్తో పాటు అరవింద్ కేజ్రీవాల్పై తీవ్ర వ్యతిరేకతకు ‘‘శీష్ మహల్’’ ఒక కారణమైంది. కేజ్రీవాల్ అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి నివాసాన్ని కోట్లు ఖర్చు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ దీనిని ఒక ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కాగ్ నివేదిక కూడా ఈ ఖర్చుల్ని తప్పుపట్టింది. భవనం పునరుద్ధరణకు ప్రాథమిక అంచనా రూ. 7.91 కోట్లు అని కాగ్ దర్యాప్తులో తేలింది. అయితే, 2020లో ఇది రూ. 8.62 కోట్లకు, 2022 నాటికి రూ. 33.66 కోట్లకు పెరిగింది. సాధారణ వ్యక్తిగా ఉంటానని ఢిల్లీ ప్రజలకు చేసిన వాగ్దానాన్ని కేజ్రీవాల్ మరిచారంటూ, అవినీతికి పాల్పడ్డారంటూ బీజేపీ విమర్శించింది.
లిక్కర్ స్కామ్:
ఢిల్లీలో ఆప్ ప్రతిష్టకు ‘‘ఢిల్లీ లిక్కర్ స్కామ్’’ భంగం కలిగించింది. టెండర్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఈడీ, సీబీఐ ఈ కేసుని విచారించాయి. ఈ కేసులో భాగంగా కేజ్రీవాల్, సిసోడియా, సత్యేందర్ జైన్ వంటి కీలక నేతలు జైలు పాలయ్యారు. ఢిల్లీని తాగుబోతుల నగరంగా మారుస్తుందని బీజేపీ, ఆప్పై విమర్శలు గుప్పించింది.
తాజావార్తలు
-
Sharwanand : మహాభారతం నేపథ్యంలో నాగబంధం దర్శకుడితో శర్వానంద్..
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
-
Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!