AAP: “లిక్కర్ స్కామ్” టూ “శీష్ మహల్”.. ఢిల్లీలో ఆప్ ఘోర పరాజయానికి కారణాలు ఇవే..
- లిక్కర్ స్కామ్ టూ శీష్ మహల్..
- ఢిల్లీలో ఆప్ ఘోర పరాజయానికి కారణాలు..
- కేజ్రీవాల్ సర్కార్పై పెరిగిన వ్యతిరేకత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. ఆప్ అధినేత కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం అతిశీ మార్లేనా వంటి వారితో పాటు ఆ పార్టీకి చెందిన సౌరభ్ భరద్వాజ్, సోమ్నాథ్ భారత, సత్యేందర్ జైన్ వంటి వారు వెనకంజలో ఉన్నారు. పదేళ్ల పాటు ఢిల్లీని పాలించిన ఆప్కి ఈ ఫలితాలు రుచించడం లేదు. ఇదే సమయంలో, దాదాపుగా 27 ఏళ్ల పాటు అధికారం కోసం శ్రమిస్తున్న బీజేపీ కల నెరవేరబోతోంది. అయితే, ఆప్ ఘోరపరాజయానికి అది చేసుకున్న స్వయంకృతాపరాధమే కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఆప్ ఓటమికి కారణాలు ఇవే:
Also Read
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
- Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
ప్రభుత్వ వ్యతిరేకత:
2015, 2020లో గెలిచి వరసగా ఆప్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. విద్య , ఆరోగ్యం, విద్యుత్, నీటి సబ్సిడీలతో తన పదవీ కాలంలో ఓటర్లను సంతృప్తి పరిచింది. అయితే, రాజధానిలో గాలి నాణ్యత, యమునా కాలుష్యం ఢిల్లీ ఓటర్లలో ఆప్ పట్ల వ్యతిరేకతను పెంచాయి. కేంద్రంలోని బీజేపీ తమ ప్రభుత్వానికి పనిచేసేందుకు అడ్డంకులు సృష్టిస్తోందని పలుమార్లు కేజ్రీవాల్ ఆరోపించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండటంతో పాటు కేంద్రంలో బీజేపీ ఉండటం, ఢిల్లీలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులే ఎంపీలుగా ఉండటంతో ఈసారి ఢిల్లీ ఓటర్లు బీజేపీకి మద్దతు తెలిపారు.
శీష్ మహల్:
ఆప్తో పాటు అరవింద్ కేజ్రీవాల్పై తీవ్ర వ్యతిరేకతకు ‘‘శీష్ మహల్’’ ఒక కారణమైంది. కేజ్రీవాల్ అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి నివాసాన్ని కోట్లు ఖర్చు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ దీనిని ఒక ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కాగ్ నివేదిక కూడా ఈ ఖర్చుల్ని తప్పుపట్టింది. భవనం పునరుద్ధరణకు ప్రాథమిక అంచనా రూ. 7.91 కోట్లు అని కాగ్ దర్యాప్తులో తేలింది. అయితే, 2020లో ఇది రూ. 8.62 కోట్లకు, 2022 నాటికి రూ. 33.66 కోట్లకు పెరిగింది. సాధారణ వ్యక్తిగా ఉంటానని ఢిల్లీ ప్రజలకు చేసిన వాగ్దానాన్ని కేజ్రీవాల్ మరిచారంటూ, అవినీతికి పాల్పడ్డారంటూ బీజేపీ విమర్శించింది.
లిక్కర్ స్కామ్:
ఢిల్లీలో ఆప్ ప్రతిష్టకు ‘‘ఢిల్లీ లిక్కర్ స్కామ్’’ భంగం కలిగించింది. టెండర్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఈడీ, సీబీఐ ఈ కేసుని విచారించాయి. ఈ కేసులో భాగంగా కేజ్రీవాల్, సిసోడియా, సత్యేందర్ జైన్ వంటి కీలక నేతలు జైలు పాలయ్యారు. ఢిల్లీని తాగుబోతుల నగరంగా మారుస్తుందని బీజేపీ, ఆప్పై విమర్శలు గుప్పించింది.
తాజావార్తలు
-
Idupu Kayitham : ‘ఇడుపు కాయితం’ చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
-
SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
-
Chanakya Niti: జీవితంలో గెలవాలంటే ‘చాణక్యుడి’ ఈ ఒక్క సూత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు!
-
China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
-
Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!