భారత అమ్మాయిల హాకీ జట్టు అదరగొట్టింది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఓటమి అనేది ఎరుగకుండా టైటిల్ను కైవసం చేసుకుంది. బుధవారం ఫైనల్లో 1-0తో చైనాను చిత్తు చేసి ఛాంపియన్గా నిలిచింది. దీపిక 31వ నిమిషంలో గోల్ చేసి భారత్ను ఆధిక్యంలో నిలిపింది. దీంతో.. ఆసియా మహిళల ఛాంపియన్స్ ట్రోఫీని వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది.