Keerthy Suresh: ఇటీవలి కాలంలో కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతోంది. అది మన జీవితాలను సులభతరం చేస్తూనే, మరోవైపు తీవ్రమైన సమస్యలను సృష్టిస్తోంది. ముఖ్యంగా డీప్ఫేక్ టెక్నాలజీ, మార్ఫింగ్ ఫోటోలు, నకిలీ వీడియోలు సినీ నటీనటుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా ఈ సమస్య గురించే ప్రసిద్ధ నటి కీర్తి సురేష్ బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేసింది.
మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ కేసు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ కేసు విచారణపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పందించారు. “చిరంజీవి గారి ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు నమోదు చేశాం. అశ్లీలంగా మార్ఫింగ్ చేసిన కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. మూలాలను గుర్తించి, బాధ్యులైన నిందితులను తప్పకుండా అరెస్ట్ చేస్తాం” అని ఆయన స్పష్టం చేశారు. Also Read : Allu Arjun – Atlee : అల్లు అర్జున్ – అట్లీ సినిమా…