Keerthy Suresh: ఏఐ మార్ఫింగ్ ఫొటోలు వైరల్.. కీర్తి సురేష్ తీవ్ర ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Keerthy Suresh: ఇటీవలి కాలంలో కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతోంది. అది మన జీవితాలను సులభతరం చేస్తూనే, మరోవైపు తీవ్రమైన సమస్యలను సృష్టిస్తోంది. ముఖ్యంగా డీప్ఫేక్ టెక్నాలజీ, మార్ఫింగ్ ఫోటోలు, నకిలీ వీడియోలు సినీ నటీనటుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా ఈ సమస్య గురించే ప్రసిద్ధ నటి కీర్తి సురేష్ బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తన పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని బోల్డ్ ఫొటోలు చూసి తానే షాక్ అయ్యానని తెలిపింది. అవి తాను దిగిన ఫోటోలు కాకుండా, పూర్తిగా AI ద్వారా రూపొందించిన నకిలీ చిత్రాలని ఆమె స్పష్టం చేసింది. ఫోటోలు ఎంత నిజంగా కనిపిస్తున్నాయంటే, వాటిని చూసినప్పుడు నిజంగానే నేను ఇలా ఫోజులిచ్చానా? అని నేను నన్నే ప్రశ్నించుకున్నా అని తెలిపింది. ఈ నకిలీ ఫోటోలు తనను మానసికంగా తీవ్రంగా బాధించాయని, ఇలాంటి టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
READ MORE: Raja Singh: రాజమౌళి ప్రతి సినిమాను హిందువులు బ్యాన్ చేయాలి..
Also Read
- రూ.11,999 ధర, 8GB RAM, 6000mAh బ్యాటరీతో 5G స్మార్ట్ ఫోన్స్.. వచ్చే వారంలోనే గ్రాండ్ రిలీజ్..
- CJP Protest: అభిజిత్ హీరో.. సోనమ్ జీరోనా..? వాంగ్చుక్ను పట్టించుకోని సీజేపీ..
- Dharmendra Pradhan: సోషల్ మీడియా ఖాతాల్లో మార్పు.. కేంద్రమంత్రి హోదా తొలగింపు
- Abhijeet Dipke: నా కొడుకు కష్టానికి ఫలితం దక్కింది.. అభిజిత్ దీప్కే తల్లి ఆనందం
కేవలం తనకే కాదు, సోషల్ మీడియాలో ఉన్న ఏ వ్యక్తికైనా ఈ ముప్పు పొంచి ఉందని కీర్తి హెచ్చరించింది. ప్రస్తుతం నటీమణులు రష్మిక మందన్న, సమంత సహా పలువురు సెలబ్రిటీలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. AI టెక్నాలజీ సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ దాన్ని నియంత్రించడం చాలా కష్టమవుతోందని, ప్రజలను రక్షించేందుకు సరైన చట్టాలు అవసరమని కీర్తి స్పష్టం చేసింది. “రివాల్వర్ రీటా” సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న కీర్తి, తనకు సంబంధించిన తప్పుదారి పట్టించే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానులు సైతం అయోమయానికి గురయ్యారని చెప్పింది. తాను సాధారణంగా ఎక్కువ గ్లామర్ చూపించని నటి అయినప్పటికీ, AI ద్వారా పూర్తిగా నకిలీగా రూపొందించిన బోల్డ్ ఫొటోలు విపరీతంగా చక్కర్లు కొట్టడం తాను భరించలేనిదిగా ఉందని వెల్లడించింది.
తాజావార్తలు
-
Shubhakshetra Fraud: శుభాక్షేత్ర మోసం.. మరో కీలక నిందితుడు అరెస్ట్.!
-
రూ.11,999 ధర, 8GB RAM, 6000mAh బ్యాటరీతో 5G స్మార్ట్ ఫోన్స్.. వచ్చే వారంలోనే గ్రాండ్ రిలీజ్..
-
CJP Protest: అభిజిత్ హీరో.. సోనమ్ జీరోనా..? వాంగ్చుక్ను పట్టించుకోని సీజేపీ..
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Dharmendra Pradhan: సోషల్ మీడియా ఖాతాల్లో మార్పు.. కేంద్రమంత్రి హోదా తొలగింపు
ట్రెండింగ్
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!