Keerthy Suresh: ఏఐ మార్ఫింగ్ ఫొటోలు వైరల్.. కీర్తి సురేష్ తీవ్ర ఆవేదన..
Keerthy Suresh: ఇటీవలి కాలంలో కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతోంది. అది మన జీవితాలను సులభతరం చేస్తూనే, మరోవైపు తీవ్రమైన సమస్యలను సృష్టిస్తోంది. ముఖ్యంగా డీప్ఫేక్ టెక్నాలజీ, మార్ఫింగ్ ఫోటోలు, నకిలీ వీడియోలు సినీ నటీనటుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా ఈ సమస్య గురించే ప్రసిద్ధ నటి కీర్తి సురేష్ బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తన పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని బోల్డ్ ఫొటోలు చూసి తానే షాక్ అయ్యానని తెలిపింది. అవి తాను దిగిన ఫోటోలు కాకుండా, పూర్తిగా AI ద్వారా రూపొందించిన నకిలీ చిత్రాలని ఆమె స్పష్టం చేసింది. ఫోటోలు ఎంత నిజంగా కనిపిస్తున్నాయంటే, వాటిని చూసినప్పుడు నిజంగానే నేను ఇలా ఫోజులిచ్చానా? అని నేను నన్నే ప్రశ్నించుకున్నా అని తెలిపింది. ఈ నకిలీ ఫోటోలు తనను మానసికంగా తీవ్రంగా బాధించాయని, ఇలాంటి టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
READ MORE: Raja Singh: రాజమౌళి ప్రతి సినిమాను హిందువులు బ్యాన్ చేయాలి..
Also Read
- Tejasvi Surya: రూ.600 కోట్లతో మైనార్టీల కాలనీల్లో రోడ్లా? కర్ణాటక ప్రభుత్వంపై తేజస్వి సూర్య ధ్వజం
- PSL: చివరి ఓవర్ థ్రిల్లర్.. 2 పరుగుల తేడాతో విజయం.. ఫైనల్లోకి అగుడు పెట్టిన హైదరాబాద్ జట్టు..
- School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు
- Nitin Gadkari: "కులం గురించి మాట్లాడితే తన్నులు పడతాయ్".. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు!
కేవలం తనకే కాదు, సోషల్ మీడియాలో ఉన్న ఏ వ్యక్తికైనా ఈ ముప్పు పొంచి ఉందని కీర్తి హెచ్చరించింది. ప్రస్తుతం నటీమణులు రష్మిక మందన్న, సమంత సహా పలువురు సెలబ్రిటీలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. AI టెక్నాలజీ సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ దాన్ని నియంత్రించడం చాలా కష్టమవుతోందని, ప్రజలను రక్షించేందుకు సరైన చట్టాలు అవసరమని కీర్తి స్పష్టం చేసింది. “రివాల్వర్ రీటా” సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న కీర్తి, తనకు సంబంధించిన తప్పుదారి పట్టించే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానులు సైతం అయోమయానికి గురయ్యారని చెప్పింది. తాను సాధారణంగా ఎక్కువ గ్లామర్ చూపించని నటి అయినప్పటికీ, AI ద్వారా పూర్తిగా నకిలీగా రూపొందించిన బోల్డ్ ఫొటోలు విపరీతంగా చక్కర్లు కొట్టడం తాను భరించలేనిదిగా ఉందని వెల్లడించింది.
తాజావార్తలు
-
Samsung Galaxy F17e 5G: సామ్ సంగ్ 5G ఫోన్ కేవలం రూ.13,774 కే.. 6000 mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Tejasvi Surya: రూ.600 కోట్లతో మైనార్టీల కాలనీల్లో రోడ్లా? కర్ణాటక ప్రభుత్వంపై తేజస్వి సూర్య ధ్వజం
-
PSL: చివరి ఓవర్ థ్రిల్లర్.. 2 పరుగుల తేడాతో విజయం.. ఫైనల్లోకి అగుడు పెట్టిన హైదరాబాద్ జట్టు..
-
School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు
-
Nizamabad: పోలీస్ స్టేషన్ భవనం పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!