జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్రతో ఏర్పాటు చేసిన దండి కుటీర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొనేందుకు గుజరాత్లోని గాంధీనగర్కు వెళ్లిన సీఎం చంద్రబాబును దండి కుటీర్ను సందర్శించాలని ప్రధాని మోదీ సూచించారు.