సంచలనం సృష్టించిన ఐబొమ్మ (iBomma) పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవి పోలీసుల కస్టడీలో ఉన్నాడు. గత రెండు రోజులుగా విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం (నవంబర్ 22, 2025) మూడో రోజు విచారణను కూడా ముగించారు. అయితే, రవి విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని, పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడని పోలీసులు వెల్లడించారు. మూడో రోజు విచారణలో కీలక సమాచారం రాబట్టాలని పోలీసులు ప్రయత్నించినప్పటికీ, నిందితుడు ఇమ్మడి రవి వారిని తప్పుదారి పట్టిస్తున్నట్లు…