దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ.550 కోట్ల భారీ హవాలా కుంభకోణం వెలుగులోకి రావడంతో దర్యాప్తు సంస్థలు విస్తుపోతున్నాయి. కేవలం రూ.10 వేల నుంచి రూ.12 వేల రూపాయల నెలసరి ఆదాయం కలిగిన ఒక సామాన్య రాపిడో డ్రైవర్ ఖాతాలో ఏకంగా రూ.300 కోట్లు చేతులు మారడం చూస్తుంటే.. మోసగాళ్లు సామాన్యులను ఏ స్థాయిలో పావులుగా వాడుకుంటున్నారో అర్థమవుతోంది.
Hyderabad Cybercrime Police: హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపింది. పోలీసుల ప్రకటనల ప్రకారం.. మోసగాళ్లు సోషల్ మీడియా, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు ద్వారా అత్యధిక లాభాలు లేదా గ్యారంటీ ప్రాఫిట్లు ఇస్తామని చెప్పి బాధితులను ఆకర్షిస్తున్నారు. ఈ మోసగాళ్లు నకిలీ వెబ్సైట్లు, ట్రేడింగ్ డాష్బోర్డులు, యాప్లు వాడి నకిలీ లాభాలు చూపిస్తూ మరిన్ని పెట్టుబడులు పెట్టమని ప్రలోభపెడతారు.