కారుకు మీడియా సంస్థ పేరు స్టిక్కర్ పెట్టుకొని గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా వివరాలు వెల్లడించారు. నర్సీపట్నం శివారులో వాహన తనిఖీలు చేస్తుండగా.. కారులో అక్రమంగా తరలిస్తున్న 205 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టాఫ్ రూం తాళం పగలగొట్టి కొందరు దుండగులు పాఠశాల రికార్డులను తగలబెట్టారు. గదిలో రికార్డులు, పరీక్ష పత్రాలు కాలి బూడిదయ్యాయి. అర్ధరాత్రి సమయంలో దుండగులు పాఠశాలలోకి చొరబడి పాఠశాల రికార్డులను ధ్వంసం చేశారు.