Crime: 45 ఏళ్ల వయసు ఉన్న పెళ్లి కాని వ్యక్తి, తనకు 18 ఎకరాలు ఉందని అయినా వధువు దొరకలేదని తన బాధను ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అనిరుద్ధాచార్య మహరాజ్కు చెప్పుకోవడం అతడి చావుకు కారణమైంది. మధ్యప్రదేశ్ జబల్పూర్ జిల్లాలోని పదర్వార్ (ఖిటోలా) గ్రామానికి చెందిన ఇంద్రకుమార్ తివారీ, పార్ట్టైమ్ టీచర్, రైతుగా పనిచేస్తున్నారు. అయితే, అతను వధువు కోసం నిరాశ వ్యక్తం చేసిన వీడియో వైరల్ కావడంతో, అతడికి ఉన్న 18 ఎకరాలను కొట్టేయాలని మోసగాళ్లు…
Bengaluru: బెంగళూర్లో ఓ చెత్త లారీలో మహిళ మృతదేహం కనిపించడం కలకలం రేపింది. 30-35 ఏళ్లు ఉన్న మహిళ మృతదేహాన్ని గోనె సంచిలో నింపి లారీలో విసిరేశారు. అయితే, ప్రస్తుతం మహిళ ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు. మహిళ గుర్తింపు కోసం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Woman Kills Husband: దేశవ్యాప్తంగా మగాళ్లకు భద్రత లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయా..? అనే అనుమానం వచ్చేలా హత్యలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వివాహిత మహిళలు తమ భర్తల్ని ప్రియుడితో కలిసి చంపేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. దీనికి తాజాగా ఉదాహరణ, ఇటీవల మేఘాలయాలో జరిగిన రాజా రఘువంశీ హత్య. భార్య సోమన్ తన లవర్ రాజ్ కుష్వాహాతో ప్లాన్ చేసి హత్య చేసింది. తాజాగా, కర్ణాటకలో కూడా ఇలాంటి ఘోరమే మరోకటి జరిగింది. ఒక మహిళ…
Kolkata law student case: కోల్కతాలో 24 ఏళ్ల లా విద్యార్థినిపై క్యాంపస్లోనే సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన బెంగాల్లో రాజకీయ చర్చకు దారి తీసింది. ప్రతిపక్ష బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడి చేస్తోంది. ముగ్గురు వ్యక్తులు కలిసి విద్యార్థినిపై క్యాంపస్లోని గార్డు రూంలో అత్యాచారానికి పాల్పడ్డారు.
Kolkata: కోల్కతాలో మరో ఆర్జీకర్ లాంటి ఘటన జరిగింది. కస్బా లా కాలేజీలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం క్యాంపస్ లో ఈ ఘటన జరిగింది. గురువారం అరెస్ట్ అయిన ముగ్గురు నిందితుల్లో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు, మరోకరిని కాలేజీలో పనిచేసే వ్యక్తిగా గుర్తించారు. గతేడాది కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన పీజీ వైద్యురాలి హత్యాచార ఘటనను తాజా కేసు గుర్తు చేసింది.
Relationship: ఫేస్బుక్ పరిచయం అక్రమ సంబంధంగా మారింది. ఆ తర్వాత ప్రాణాలను తీసింది. కర్ణాటక హసన్లో ఒక మహిళను ఫేస్బుక్లో పరిచమైన వ్యక్తి హత్య చేశాడు. 28 ఏళ్ల వివాహిత తనతో శృంగార సంబంధాన్ని కొనసాగించాలని ఒత్తిడి తీసుకురావడంతో, ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీని తర్వాత నిందితుడు మహిళను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని మాండ్యాలోని తన వ్యవసాయ భూమిలో పాతిపెట్టాడు.
Gadwal Murder Twist: గద్వాల జిల్లా సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు ప్రధాన కుట్రదారుడిగా పోలీసులు గుర్తించారు. తాజా దర్యాప్తులో అతను తేజేశ్వర్ హత్య తర్వాత తన భార్యను కూడా హత్య చేయాలనే పథకం వేసినట్టు వెల్లడైంది. తిరుమలరావు, ఐశ్వర్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. వివాహమైన 8 సంవత్సరాలయినా సంతానం లేని పరిస్థితుల్లో, ఐశ్వర్యతో పిల్లలు కనాలని అతనికి వాంఛ కలిగింది. ఈ…
నిన్న సోనమ్-రఘువంశీ…నేడు ఐశ్వర్య-తేజేశ్వర్…ఒకటా రెండా…దొరికిపోతామనే భయం లేదు. చేసేది తప్పనే సోయి లేదు. ఎంతకైనా బరి తెగిస్తున్నారు. కట్టుకున్న భర్తలనే లేపేస్తున్నారు. చంపటమే పరిష్కారం అనుకుంటున్నారు. కొందరు భార్యల్లో క్రూరత్వం పెరిగిపోతోంది. రాక్షస భార్యల గురించి చెప్పుకుంటూ…పోతే హిస్టరీ చాంతాడంత ఉంది. మెజారిటీ మర్డర్ కథల్లో ఇప్పుడు భార్యే హంతకురాలు…భర్తే హతుడు. అందంగా తయారై పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. కల్యాణమండపంలో…తలవంచి భర్తతో మూడు ముళ్లు వేయించుకుంటున్నారు. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల ముందు…మహానటిలా నటిస్తూ…ఎంతో సంతోషంగా నాలుగడుగులు వేస్తున్నారు. పెళ్లి…
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ నిత్య పెళ్లి కూతురు వ్యవహారం వెలుగు చూసింది.. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కూడా కాదు.. ఏకంగా ఇప్పటి వరకు 12 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురుపై జిల్లా ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు బాధితులు..
తండ్రి అంటే చెట్టంత బలం. అలాంటి తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం ఇద్దరు కూతుళ్లు.. కర్కశంగా ప్రవర్తించారు. ప్రేమకు అడ్డు చెప్పాడని కన్న తండ్రినే పొట్టన పెట్టుకున్నారు. కంటే కూతుర్నే కనాలి.. కంటే కూతుర్నే కనాలి అంటారు.. తల్లిదండ్రులను కడవరకు కనిపెట్టుకుంటుంది. అంటే.. కూతురు అయితే తల్లిదండ్రులను కడవరకు కనిపెట్టుకుని ఉంటుందని దీని అర్ధం.. భిన్నంగా కొంత మంది కూతుళ్ల ప్రవర్తన.. కానీ కాలం మారింది. కలికాలం దాపురించింది. ఎందుకంటే కొంత…