Honeymoon Murder Case: సోనమ్కు మరణశిక్ష విధించాలి..రాజా రఘువంశీ కుటుంబం..
- హనీమూన్ మర్డర్ కేసులో చార్జిషీట్ దాఖలు..
- సోమన్కు మరణశిక్ష విధించాలని రాజా రఘువంశీ కుటుంబం డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honeymoon Murder Case: ‘‘హనీమూన్ మర్డర్ కేసు’’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. భర్త రాజా రఘువంశీని, భార్య సోనమ్ మేఘాలయకు తీసుకెళ్లి, కిరాయి హంతకులతో హత్య చేయించింది. సోమన్కు రాజ్ కుశ్వాహా అనే వ్యక్తితో ఎఫైర్ ఉంది. దీంతో ఇద్దరు కలిసి ఇండోర్కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీని హత్య చేశారు. వీరితో పాటు విశాల్ సింగ్ చౌహాన్, ఆకాష్ సింగ్ రాజ్పుత్, ఆనంద్ కుర్మిలు నిందితులుగా ఉన్నారు. మొత్తం ఈ కేసులో 8 మందిపై మేఘాలయ పోలీసులు శుక్రవారం 790 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు.
రఘువంశీ హత్యకు నేరపూరిత కుట్ర, సాక్ష్యాలను నాశనం చేసినందుకు భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద వారిపై అభియోగాలు మోపారు. అయితే, ఈ కేసులో రాజా రఘువంశీ కుటుంబం సోనమ్తో పాటు నిందితులకు మరణశిక్ష విధించాలని కోరింది. రాజా రఘువంశీ అన్న విపిన్ మాట్లాడుతూ.. ‘‘ నా కుటుంబానికి ఒకటే డిమాండ్ ఉంది. సోనమ్, రాజ్ కుశ్వాతో సాటు ఐదుగురు నిందితులకు మరణశిక్ష విధించాలి.’’ అని ఇండోర్లో అన్నారు.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
Read Also: Sandeep Reddy : బాహుబలి-2లో ప్రభాస్ ను చూసి భయపడ్డా.. సందీప్ కామెంట్స్
ఈ కేసులో సోనమ్ కుటుంబం కూడా రాజా రఘువంశీ కుటుంబానికి మద్దతు ఇచ్చింది. తన సోదరితో సంబంధాలు తెంచుకున్నట్లు ఆమె అన్న గోవింద్ ఇదివరకే చెప్పారు. రాజా రఘువంశీకి న్యాయం జరిగేలా చట్టపరమైన పోరాటం చేస్తామని ప్రకటించారు. అయితే, సోనమ్ అన్న విపిన్ తన సొంత ప్రయోజనాలనెు కాపాడుకునేందుకు అబద్ధం చెబుతున్నారని విపిన్ ఆరోపించారు. గోవింద్ మా కుటుంబంతో ఉన్నామని చెబుతూనే, సోనమ్ కోసం వాదించేందుకు న్యాయవాదిని నియమించుకున్నాడని చెప్పారు.
మే 21న హనీమూన్ కోసం రాజా రఘువంశీ, ఆయన భార్య సోనమ్ మేఘాలయకు వెళ్లారు. మే 26న ఈ జంట కనిపించడం లేదని ఫిర్యాదు అందింది. దీంతో మేఘాలయ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక గ్రామస్తులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. జూన్ 2న సోహ్రాలోని ఓ జలపాత వద్ద లోయలో రాజా రఘువంశీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత విచారణలో సోనమ్ పోలీసుల ముందు లొంగిపోయింది. సోనమ్కు ఆమె ప్రియుడితో సంబంధం ఉండటంతోనే హత్య జరిగినట్లు విచారణలో వెల్లడైంది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!