Honeymoon Murder Case: సోనమ్కు మరణశిక్ష విధించాలి..రాజా రఘువంశీ కుటుంబం..
- హనీమూన్ మర్డర్ కేసులో చార్జిషీట్ దాఖలు..
- సోమన్కు మరణశిక్ష విధించాలని రాజా రఘువంశీ కుటుంబం డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honeymoon Murder Case: ‘‘హనీమూన్ మర్డర్ కేసు’’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. భర్త రాజా రఘువంశీని, భార్య సోనమ్ మేఘాలయకు తీసుకెళ్లి, కిరాయి హంతకులతో హత్య చేయించింది. సోమన్కు రాజ్ కుశ్వాహా అనే వ్యక్తితో ఎఫైర్ ఉంది. దీంతో ఇద్దరు కలిసి ఇండోర్కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీని హత్య చేశారు. వీరితో పాటు విశాల్ సింగ్ చౌహాన్, ఆకాష్ సింగ్ రాజ్పుత్, ఆనంద్ కుర్మిలు నిందితులుగా ఉన్నారు. మొత్తం ఈ కేసులో 8 మందిపై మేఘాలయ పోలీసులు శుక్రవారం 790 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు.
రఘువంశీ హత్యకు నేరపూరిత కుట్ర, సాక్ష్యాలను నాశనం చేసినందుకు భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద వారిపై అభియోగాలు మోపారు. అయితే, ఈ కేసులో రాజా రఘువంశీ కుటుంబం సోనమ్తో పాటు నిందితులకు మరణశిక్ష విధించాలని కోరింది. రాజా రఘువంశీ అన్న విపిన్ మాట్లాడుతూ.. ‘‘ నా కుటుంబానికి ఒకటే డిమాండ్ ఉంది. సోనమ్, రాజ్ కుశ్వాతో సాటు ఐదుగురు నిందితులకు మరణశిక్ష విధించాలి.’’ అని ఇండోర్లో అన్నారు.
Also Read
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
Read Also: Sandeep Reddy : బాహుబలి-2లో ప్రభాస్ ను చూసి భయపడ్డా.. సందీప్ కామెంట్స్
ఈ కేసులో సోనమ్ కుటుంబం కూడా రాజా రఘువంశీ కుటుంబానికి మద్దతు ఇచ్చింది. తన సోదరితో సంబంధాలు తెంచుకున్నట్లు ఆమె అన్న గోవింద్ ఇదివరకే చెప్పారు. రాజా రఘువంశీకి న్యాయం జరిగేలా చట్టపరమైన పోరాటం చేస్తామని ప్రకటించారు. అయితే, సోనమ్ అన్న విపిన్ తన సొంత ప్రయోజనాలనెు కాపాడుకునేందుకు అబద్ధం చెబుతున్నారని విపిన్ ఆరోపించారు. గోవింద్ మా కుటుంబంతో ఉన్నామని చెబుతూనే, సోనమ్ కోసం వాదించేందుకు న్యాయవాదిని నియమించుకున్నాడని చెప్పారు.
మే 21న హనీమూన్ కోసం రాజా రఘువంశీ, ఆయన భార్య సోనమ్ మేఘాలయకు వెళ్లారు. మే 26న ఈ జంట కనిపించడం లేదని ఫిర్యాదు అందింది. దీంతో మేఘాలయ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక గ్రామస్తులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. జూన్ 2న సోహ్రాలోని ఓ జలపాత వద్ద లోయలో రాజా రఘువంశీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత విచారణలో సోనమ్ పోలీసుల ముందు లొంగిపోయింది. సోనమ్కు ఆమె ప్రియుడితో సంబంధం ఉండటంతోనే హత్య జరిగినట్లు విచారణలో వెల్లడైంది.
తాజావార్తలు
-
Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
-
Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
-
Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!