UP Crime: భూ వివాదంలో పొరుగువారిని ఇరికించేందుకు కూతురి హత్య..
- ఇరుగుపొరుగు వారితో భూవివాదం..
- వారిని ఇరికించేందుకు కన్న కూతురి హత్య..
- ఉత్తర్ ప్రదేశ్తో అమానుష ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Crime: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం జరిగింది. భూ వివాదంలో ఇరుగుపొరుగు వారిని ఇరికించేందుకు ఓ తండ్రి కన్న కూతురినే హతమార్చాడు. ఈ ఘటన ఖుషినగర్ జిల్లాలో చోటు చేసుకుంది. నలుగురు పిల్లల్లో చిన్నదైన కూతురు గొంతు కోసి హత్య చేసినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. తన 16 ఏళ్ల కుమార్తెను హత్య చేసిన దాదాపు రెండు వారాల తర్వాత మంగళవారం నిందితుడు జయనారాయణ్ సింగ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
నెబువా నౌరంగియా గ్రామంలో నవంబర్ 1వ తేదీ రాత్రి 10వ తరగతి విద్యార్థిని హత్యకు గురైంది. నౌకా తోలాలోని తమ ఇంట్లోకి చొరబాటుదారులు ప్రవేశించారని, ఆమె నిద్రిస్తున్న సమయంలో తన కుమార్తెపై దాడి చేశారని, ఆమెను రక్షించడానికి ప్రయత్నించినప్పుడు తన రెండు చేతులకు గాయాలయ్యాయని ఆమె తండ్రి పోలీసులకు చెప్పాడు. మిగిలిన కుటుంబం ఛత్ పూజ కోసం ఇంటి నుంచి దూరంగా ఉన్నారని, ఘటన జరిగిన సమయంలో తాను తన కుమార్తె మాత్రమే ఉన్నట్లు నిందితుడు వెల్లడించాడు.
అయితే, అనుమానించిన పోలీసులు బాలిక తండ్రిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో తానే తన కూతురిని హత్య చేసినట్లు జయనారాయణ అంగీకరించాడు. చాలా కాలంగా ఆస్తి వివాదం కారణంగా తన పొరుగువారిని ఇరికించేందుకు ఈ సంఘటనకు పాల్పడినట్లు చెప్పాడు.
తాజావార్తలు
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
-
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
-
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!