బంగ్లాదేశ్ క్రికెటర్ నిప్పులపై నడిచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. అయితే తాను నడిచింది ఏదో మొక్కుబడి కోసం కాదు. మెదడు చురుగ్గా ఉండటం కోసమని చెబుతున్నాడు.
భారత్, ఐర్లాండ్ మధ్య జరిగే తొలి టీ20 మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా.. తొలి మ్యాచ్ డబ్లిన్ లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 7.30 గంటలకు భారత్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.