స్వదేశంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరగనున్న డే/నైట్ టెస్ట్కు స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇటీవలే గాయం నుంచి కోలుకుని జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన జడేజా శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగిన టెస్టులో ఆల్రౌండ్ ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్లో అజేయ సెంచరీతో చెలరేగిన జడేజా (175 నాటౌట్).. బౌలింగ్లో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టాడు. అయితే ఫిట్నెస్ సమస్యలతో…
2011లో టీమిండియా ప్రపంచకప్ గెలిచింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించిన భారత్ రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. మళ్లీ 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ను ముద్దాడింది. అంతటి గొప్ప విజయం సాధించిన భారత జట్టులోని ఆటగాళ్లలో ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఒక్కడే క్రికెట్లో కొనసాగుతుండటం గమనార్హం. మిగతా క్రికెటర్లందరూ రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఇటీవల శ్రీశాంత్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ప్రస్తుతం ప్రపంచకప్ విన్నింగ్ టీమ్లో కోహ్లీ ఒక్కడే మిగిలాడు.…
మరో రెండు వారాల్లో ఐపీఎల్-15 సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టుకు శుభవార్త అందింది. ఆ జట్టు మెగా వేలంలో భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఈ సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాడు. మైదానంలో ఆర్చర్ బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్న వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన ముంబై అభిమానులు…
క్రికెట్లో మన్కడింగ్ పలు మార్లు ఎలాంటి వివాదాలను సృష్టించిందో గతంలో ఎన్నో సార్లు చూశాం. బౌలర్ బంతి వేసే సమయంలో నాన్ స్ట్రైకర్ ముందే క్రీజు దాటితే బౌలర్ అవుట్ చేయడాన్ని మన్కడింగ్ అంటారు. అయితే ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో మెల్బోర్న్ క్రికెట్ అసోసియేషన్ సరికొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వివాదాలకు కారణమయ్యే మన్కడింగ్పై నిషేధం విధిస్తున్నట్లు ఎంసీసీ ప్రకటించింది. బౌలింగ్ సమయంలో నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న ఆటగాడు పరుగు కోసం సిద్ధంగా ఉండాలి కాబట్టి అందులో భాగంగానే…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల తన కెరీర్లో 100వ టెస్టు ఆడాడు. ఈ టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతరం స్టేడియం నుంచి హోటల్కు వెళ్తుండగా కోహ్లీ తన అభిమానికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. బస్సు ఎక్కుతున్న సమయంలో తన కోసం వేచి చూస్తున్న ఓ దివ్యాంగ అభిమానిని చూసి కోహ్లీ చలించిపోయాడు. ఈ నేపథ్యంలో తన అభిమాని ధరమ్వీర్ పాల్కు విరాట్ కోహ్లీ తన జెర్సీని బహుమతిగా…
షేన్ వార్న్ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వెల్లడించాడు. వార్న్ ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్ కాదంటూ ఈ సమయంలో తాను వ్యాఖ్యానించాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. నిజానికి ఇలాంటి సమయంలో టీవీ ఛానల్ వారు అలాంటి ప్రశ్న అడగాల్సింది కాదు.. తాను జవాబు చెప్పాల్సింది కాదని వివరించాడు. అయితే యాంకర్ అడిగిన ప్రశ్నకు తాను నిజాయితీగా తన అభిప్రాయం చెప్పినట్లు సన్నీ తెలిపాడు. క్రికెట్లో గొప్ప ఆటగాళ్లలో…
మరికొద్దిరోజుల్లో ఐపీఎల్ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్కింగ్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. అయితే నెట్ బౌలర్గా ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్ను చెన్నై జట్టు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని క్రికెట్ ఐర్లాండ్ స్వయంగా వెల్లడించింది. ఈ లెఫ్టార్మ్ పేసర్కు ఈ అవకాశం మంచి అనుభవంగా మారాలని క్రికెట్ ఐర్లాండ్ ఆకాంక్షించింది. జోష్ లిటిల్ త్వరలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్లో బరిలోకి దిగనున్నాడు.…
సిద్దార్థ్ శుక్లా.. పునీత్ రాజ్కుమార్.. ఏపీ మంత్రి గౌతం రెడ్డి.. తాజాగా షేన్ వార్న్.. వీళ్లే కాదు ఇలా ఎందరో.. ఫిట్నెస్ కోసం శ్రమించి… ప్రాణాల మీదకు తెచ్చుకున్న వాళ్లే. అయితే.. వీళ్ల మరణాలు ఏం చెప్తున్నాయి? జిమ్ చేయడం తప్పా? అతిగా శ్రమిస్తే.. హార్ట్ ఎటాక్ తప్పదా? ఎక్సర్సైజ్ చేస్తే.. ఆరోగ్యానికి మంచిదంటారు. మరి వీళ్ల ప్రాణాల మీదకు ఎందుకొచ్చింది? ఫిట్గా ఉండేందుకు రకరకాలుగా శ్రమిస్తున్న ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్న సమస్య ఇదే. గుండె పదిలంగా…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో మైలురాయిని అందుకోనున్నాడు. శ్రీలంకతో ఈనెల 12 నుంచి బెంగళూరు వేదికగా జరిగే రెండో టెస్టు ద్వారా రోహిత్ తన కెరీర్లో 400వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. రోహిత్ ఇప్పటివరకు 44 టెస్టులు, 230 వన్డేలు, 125 టీ20లు ఆడాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ మొదట్లో వరుసగా విఫలం కావడంతో జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోలేకపోయాడు. 2013లో ఓపెనర్ అవతారం ఎత్తినప్పటి నుంచి తిరుగులేకుండా దూసుకెళ్తున్నాడు.…
శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్కు టీమిండియా మరింత బలోపేతం అయ్యింది. తొలి టెస్టుకు గాయం కారణంగా దూరంగా ఉన్న అక్షర్ పటేల్.. రెండో టెస్టు కోసం జట్టులోకి వచ్చాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకుని తగిన ఫిట్నెస్ సాధించిన అక్షర్ పటేల్ ఈ నెల 12 నుంచి శ్రీలంకతో బెంగళూరు వేదికగా జరగనున్న రెండో టెస్టు మ్యాచ్కు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్ జట్టులోకి రావడంతో కుల్దీప్ యాదవ్ టీం నుంచి…