BCCI: క్రికెట్ అడ్వైజరీ కమిటీ సిఫారసుల మేరకు బీసీసీఐ నూతన సెలెక్షన్ కమిటీని ప్రకటించింది. ఈ మేరకు ఆలిండియా సీనియర్ పురుషుల సెలెక్షన్ కమిటీని బీసీసీఐ ప్రకటించింది. మరోసారి చేతన్ శర్మనే సెలెక్షన్ కమిటీ ఛైర్మన్గా ఎంపిక చేసింది. చేతన్ శర్మ 2020 డిసెంబరు నుంచి 2022 డిసెంబరు వరకు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్గా కొనసాగారు. తాజాగా ఆయన మరో రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. అటు ఐదుగురు సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీ వివరాలను…
IND Vs SL: రాజ్కోట్ వేదికగా శ్రీలంకతో జరగనున్న మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే అనూహ్యంగా మార్పులు లేకుండానే టీమిండియా ఈ మ్యాచ్లోకి బరిలోకి దిగనున్నట్లు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. ముఖ్యంగా రెండు మ్యాచ్లలో విఫలమైన ఓపెనర్ శుభ్మన్ గిల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ను తీసుకుంటారని ప్రచారం జరిగింది. అంతేకాకుండా రెండో టీ20లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న అర్ష్దీప్ సింగ్ను కూడా పక్కనబెడతారని అందరూ ఊహించారు. కానీ వీళ్లిద్దరికీ మరోసారి…
Rishab Pant: రోడ్డుప్రమాదంలో గాయపడ్డ టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. మెరుగైన చికిత్స కోసం ఇటీవల పంత్ను డెహ్రాడూన్లోని మ్యాక్స్ హాస్పిటల్ నుంచి ముంబైలోని ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో పంత్ మోకాలికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. కారు ప్రమాదంలో పంత్ మోకాలి లిగ్మెంట్ తెగిపోయినట్టు డెహ్రాడూన్లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో తేలింది. దాంతో పంత్ను ముంబైకు ఎయిర్ లిఫ్ట్ చేశారు. శుక్రవారం నాడు పంత్…
భారత్-శ్రీలంక టీ20 సిరీస్లో నేడు నిర్ణయాత్మక పోరు జరగనుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో రెండు మ్యాచ్లు అయ్యేసరికి రెండు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఈ టీ-20 సిరీస్లో ఆఖరిపోరుకు ఇరుజట్లు సిద్ధమయ్యాయి.
Axar Patel: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో 31 బంతుల్లో అతడు 65 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తన తొలి అంతర్జాతీయ టీ20 హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. దీంతో భారత్ తరఫున ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక స్కోరు సాధించిన తొలి ఆటగాడిగా అక్షర్ పటేల్ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఏడో స్థానంలో బరిలోకి దిగి 65 పరుగులు ఎవరూ చేయలేదు.…
Sunil Gavaskar: పూణే వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే భారత్ ఓటమికి నోబాల్స్ కారణమని మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా నోబాల్స్పై మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ప్రొఫెషనల్స్ ఇలా చేయరంటూ ఘాటుగా స్పందించాడు. ఇటీవల కాలంలో ఆటగాళ్లు తరచూ పరిస్థితులు తమ నియంత్రణలో లేవని చెప్తున్నారని.. కానీ నోబాల్ వేయడం, వేయకపోవడం మాత్రం ఆటగాడి నియంత్రణలోనే ఉంటుందని గవాస్కర్ చురకలు అంటించాడు. ప్రొఫెషనల్…
Asia Cup 2023: ఈ ఏడాది టీమిండియా బిజీ బిజీగా గడపనుంది. అక్టోబరులో వన్డే ప్రపంచకప్ జరుగుతుంది. అయితే అంతకంటే ముందే ఆసియా కప్ కూడా జరగనుంది. ఈ టోర్నీని వన్డే ఫార్మాట్లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. అయితే షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉండగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ మాత్రం వేదికగా విషయాన్ని ప్రస్తావించలేదు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ సందిగ్థత వ్యక్తం చేయడంతో…
IND Vs SL: పూణె వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో శ్రీలంక 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక దంచికొట్టింది. 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 206 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో 207 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 190 పరుగులు మాత్రమే చేసింది. చివర్లో అక్షర్ పటేల్…
Team India: టీమిండియాను వరుస గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యారు. ఇటీవల కెప్టెన్ రోహిత్ కూడా గాయం కారణంగా బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా వికెట్ కీపర్ సంజూ శాంసన్ కూడా గాయపడ్డాడు. దీంతో గురువారం శ్రీలంకతో జరగబోయే రెండో టీ20కి అతడు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం అతడు ముంబైలోనే ఉన్నాడని.. రెండో మ్యాచ్ జరిగే పూణెకు వెళ్లలేదని…
Gautham Gambhir: టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ కంటే వన్డే ప్రపంచకప్కు ఆటగాళ్లు ప్రాధాన్యత ఇవ్వాలని.. ఎందుకంటే ఐపీఎల్ కంటే ప్రపంచకప్ గెలవడమే ముఖ్యమని గంభీర్ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు భారత్ టీమ్ మేనేజ్మెంట్కు కొన్ని సూచనలు చేశాడు. అవసరమైతే వన్డే ప్రపంచకప్ కోసం ఐపీఎల్ 2023 సీజన్ ఆడకుండా ఆటగాళ్లను పక్కనపెట్టాలని సూచించాడు. ఆటగాళ్లపై పనిఒత్తిడి భారం కాకుండా బీసీసీఐ ప్రణాళికలను సిద్ధం చేయాలన్నాడు. అందుకోసం ఫ్రాంచైజీలతో…