JN.1 Corona variant: దేశంలో కొత్త కోవిడ్-19 వేరియంట్ JN.1 కలవరపరుస్తోంది. ఇప్పటి వరకు దేశంలో కొత్త వేరియంట్ కేసులు 22 నమోదయ్యాయి. ఇవన్నీ కూడా రెండు రాష్ట్రాల్లోనే వెలుగులోకి వచ్చాయి. గోవాలో 21 కేసులు, కేరళలో ఒక కేసు నమోదైంది. అయితే JN.1 సోకిన వారంతా ఎలాంటి సమస్యలే లేకుండా కోలుకోవడం ఒకింత సంతోషకరమైన విషయం.
New Covid Variant: కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 మరోసారి ప్రజల్ని భయపెడుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 358 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క కేరళలోనే 300 కేసులు ఉన్నాయి. భారతదేశంలో ప్రస్తుతం 2669 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే JN.1 వేరియంట్ పెద్దగా ప్రమాదాన్ని కలిగించని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ దీనికి వేగం వ్యాప్తించే గుణం ఉందని హెచ్చరించారు.
New Covid Variant JN.1: భారతదేశంలో కొత్త కోవిడ్ వేరియంట్ JN.1 కేసులు 21 నమోదయ్యాయి. కోవిడ్ టెస్టులను ల్యాబుల్లో పరీక్షించగా ఈ కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది.
Gandhi Hospital: కోవిడ్ వైరస్ వ్యాప్తిపై వస్తున్న వదంతులను నమ్మవద్దు. ఈ నెలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కేరళలో జోరుగా సాగుతున్న జేఎన్-1 వేరియంట్తో ఐదుగురు గాంధీ ఆస్పత్రిలో చేరారనే ప్రచారం పూర్తిగా బూటకమన్నారు.
Corona : కరోనా కొత్త వేరియంట్ JN.1 మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. సింగపూర్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కరోనా ఈ వేరియంట్ ఇప్పుడు భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది.
COVID-19: 2019 చైనాలో వెలుగులోకి వచ్చిన కోవిడ్ మహమ్మారి అనతికాలంలోనే ప్రపంచాన్ని మొత్తం వ్యాపించింది. చైనా, ఇండియా, అమెరికా, ఇటలీ వంటి దేశాల్లో లక్షల్లో మరణాలకు కారణమైంది. చాలా మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ముఖ్యంగా సెకండ్ వేవ్ సమయంలో మన దేశంలో మరణాల సంఖ్య ఎక్కువైంది. ఇప్పటికీ కూడా కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ ప్రపంచంపై దాడి చేస్తూనే ఉంది.
Infosys: కోవిడ్-19 మహమ్మారి కారణంగా పలు కంపెనీలు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపయాన్ని కల్పించాయి. కరోనా ప్రభావం తగ్గినా కూడా కొందరు ఉద్యోగులు ఇంకా వర్క్ ఫ్రం హోం పద్ధతిలోనే పనిచేస్తామని కోరుకుంటున్నారు. అయితే ఐటీ కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని కొరుతున్నాయి. కొన్ని సంస్థలు కార్యాలయాలకు రాకుంటే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి.
Covid-19 Vaccine: కోవిడ్-19 మహమ్మారి ప్రపంచదేశాలను కలవరపెట్టింది. చైనాలో ప్రారంభమైన ఈ కరోనా వైరస్ అనతికాలంలోనే ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాప్తి చెందింది. లక్షల్లో ప్రజలు మరణించారు. రూపాలను మార్చుకుంటూ కొత్త వేరియంట్ల రూపంలో ప్రజలపై దాడి చేసింది. చైనాతో పాటు అమెరికా, ఇటలీ, భారత్ వంటి దేశాల్లో ఎక్కువగా మరణాలు నమోదయ్యాయి. దీన్ని అంతం చేయడానికి ప్రపంచంలోని పలు దేశాలు వ్యాక్సిన్లను తయారుచేసుకున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి నుంచి ప్రపంచదేశాలు కోలుకుంటున్నాయి.
కరోనా సృష్టించిన విలయ తాండవం అంతా ఇంతా కాదు. మూడేళ్ల క్రితం వెలుగు చూసిన కరోనా వైరస్.. ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. ప్రాణ నష్టంతో పాటు ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. కరోనా భయాల నుంచి అందరూ బయటపడిన నేపథ్యంలో మళ్లీ కరోనా అని పేరు వినిపిస్తుండడంతో భయాందోళన కలుగుతోంది.
China: చైనాలో మిస్టరీ వ్యాధి ప్రబలుతోంది. న్యూమోనియాతో అక్కడి పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా మంది అనారోగ్యంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వ్యాధి విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. చైనా నుంచి మరింత సమాచారం కావాలని కోరింది. అయితే సాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధులే అని చైనా ప్రభుత్వం చెప్పింది.