JN.1 Corona variant: దేశంలో 21 కొత్త వేరియంట్ కేసులు.. కేసులన్నీ రెండు రాష్ట్రాల్లోనే నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JN.1 Corona variant: దేశంలో కొత్త కోవిడ్-19 వేరియంట్ JN.1 కలవరపరుస్తోంది. ఇప్పటి వరకు దేశంలో కొత్త వేరియంట్ కేసులు 22 నమోదయ్యాయి. ఇవన్నీ కూడా రెండు రాష్ట్రాల్లోనే వెలుగులోకి వచ్చాయి. గోవాలో 21 కేసులు, కేరళలో ఒక కేసు నమోదైంది. అయితే JN.1 సోకిన వారంతా ఎలాంటి సమస్యలే లేకుండా కోలుకోవడం ఒకింత సంతోషకరమైన విషయం.
ఈ వేరియంట్ సోకిన వారికి తేలికపాటి పొడిదగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలతో పాటు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది. నవంబర్లో, JN.1 వేరియంట్ను గుర్తించడం కోసం మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం 62 నమూనాలను వివిధ INSACOG ల్యాబ్లకు పంపగా, డిసెంబర్లో ఇప్పటివరకు 253 నమూనాలను పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
Read Also: Priyanka : పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై మొదటిసారి నోరు విప్పిన ప్రియాంక..ఏమందంటే?
కేరలలో 79 ఏళ్ల మహిళకు JN.1 వేరియంట్ సోకినట్లు డిసెంబర్ 8న గుర్తించారు. సదరు మహిళ ఎలాంటి ఆరోగ్యపరమైన చిక్కులు లేకుండా కోలుకున్నారు. దేశంలో కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. JN.1 సబ్ వేరియంట్ సోకిన వారిలో 92 శాతం మంది ఇంటి దగ్గరే కోలుకునే అవకాశం ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ సోమవారం వెల్లడించారు. అయితే రాబోయే పండగ సీజన్ నేపథ్యంలో కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు కేంద్రం సూచనలు జారీ చేసింది. కోవిడ్ నియంత్రణ పకడ్బందీగా పాటించాలని కోరింది.
శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. భారత్ లో ప్రస్తుతం 2997 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కేరళలో మరో మరణం చోటు చేసుకోవడంతో మరణాల సంఖ్య 5,33,328కి చేరుకుంది. JN.1 (BA.2.86.1.1), ఆగస్టులో లక్సెంబర్గ్లో తొలిసారి కనుగొన్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!