ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐ చేత విచారణ చేయించాలంటూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్కు సంబంధించి హైకోర్టులో టీఎస్పీఎస్సీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
ఢిల్లీలోని లుటియన్స్లో ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఖాళీ చేశారు. ఆయన తన తల్లి సోనియా గాంధీతో కలిసి జన్పథ్లోని నివాసంలో కొంతకాలం ఉంటారు. రాహుల్ గాంధీ ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత తన అధికారిక బంగ్లాను ఖాళీ చేయమని అధికారులు కోరారు.
పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో ఎంపీగా అనర్హత వేటు పడిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం తన అధికారిక నివాసం నుండి తన వస్తువులన్నింటినీ తరలించారు. ఎంపీగా తనకు కేటాయించిన బంగ్లా నుంచి గాంధీ శుక్రవారం సాయంత్రం తన మిగిలిన వస్తువులను తరలించినట్లు వర్గాలు తెలిపాయి.
ల్యాండ్ డీల్ కేసులో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రకు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాబర్ట్ వాద్రా సంస్థ రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్కు భూమిని బదలాయించడంలో ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని పంజాబ్, హర్యానా హైకోర్టు పంజాబ్ ప్రభుత్వానికి తెలిపింది.