ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించిన ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఇంద్రవెల్లి ఘటన జరిగి 40 ఏళ్లు అవుతున్నా ఇంకా ఇక్కడి గిరిజనులు హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంలోనూ గిరిజనుల సమస్యలు పరిష్కారం కాలేదు. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల సాయం ప్రకటించాలి అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇంద్రవెల్లిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి. గిరిజన సమస్యల పరిష్కారం కోసం…