Coimbatore Blast Case: కోయంబత్తూర్ పేలుడులో “జిహాద్” కోణాలు.. నిందితుడి ఇంట్లో కీలక విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jihad literature recovered from Coimbatore car bomb accused home: తమిళనాడులో కోయంబత్తూర్ కార్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఉగ్రకోణం ఉన్నట్లు ఇప్పటికే తమిళనాడు పోలీసులు గుర్తించారు. తాజాగా నిందితుడి ఇంట్లో కీలక విషయాలను గుర్తించారు. అక్టోబర్ 23న కోయంబత్తూర్ కారు పేలుడుతో మరణించిన నిందితుడు జమేషా ముబీన్ ఇంటి నుంచి జీహాద్ కు సంబంధించిన పత్రాలను, చిత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Theft In Apple Company: అట్లుంటది మనతోటి.. ఏడేళ్లుగా ఎవరికీ తెలియకుండా రూ.140కోట్లు కొట్టేసిండు
Also Read
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
- New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
- Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై 'లవ్ యూ' నోట్!
కాఫిర్లు, జీహాద్ యువకుల కర్తవ్యం-పిల్లలు మరియు వృద్ధుల కానది చూపించే చిత్రాలు, హదీస్ కు సంబంధించిన చిత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముబీన్ ఇంటిలో ఓ పలకను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ‘‘ అల్లాహ్ ఇంటిని తాకడానికి ధైర్యం చేసే ఎవరినైనా మేము నిర్మూలిస్తాము’’ అనే వ్యాఖ్యాలను గుర్తించారు. ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఈ కేసును విచారిస్తోంది. నవంబర్ 2న ఈ కేసులో ఎన్ఐఏ మరన్ని దాడులు చేసింది.

అక్టోబర్ 23న తెల్లవారుజామున 4.30 గంటలకు కోయంబత్తూర్ లో ఓ మారుతి 800 కారులో ఎల్పీజీ సిలిండర్ కారు పేలుడు సంభవించింది. తొలుత సాధారణ పేలుడుగానే అనుకున్నప్పటికీ.. ఆ తరువాత ఉగ్రలింకులు బయటపడ్డాయి. ఈ పేలుడులో మరణించిన నిందితుడి ఇంట్లో పేలుడు పదార్థాలు అయిన పొటాషియం నైట్రేట్, అల్యూమినియం ఫైడర్, బొగ్గు, సల్ఫర్ వంటి వాటిని గుర్తించారు. దీంతో పాటు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో కారులో ఎల్పీజీ సిలిండర్ ని లోడ్ చేస్తున్న నలుగురిని గుర్తించారు. మొత్తం ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి యూఏపీఏ చట్టం కింద కేసులు నమోదు చేశారు. వీరిలో కొంతమంది ఇంతకు మందు కొంత మంది కేరళ వెళ్లారని కోయంబత్తూర్ కమిషనర్ బాలకృష్ణన్ వెల్లడించారు. 2019లో ఎన్ఐఏ వీరిని ప్రశ్నించిందని తెలిపారు. ఇదిలా ఉంటే ఈ పేలుడు ఘటన అధికార డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఒకానొక సమయంలో తమిళనాడు పోలీసులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..