ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు నెల్లూరు జిల్లాకు బయలుదేరుతున్నారు. ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి కడపకు వెళ్లనున్నారు. కడప నుంచి హెలికాఫ్టర్ ద్వారా ఉదయగిరి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సెస్ కాలేజీకీ చేరుకుంటారు. అక్కడ దివంగత మేకపాటి గౌతం రెడ్డి బౌతికకాయానికి నివాళులు ఆర్పించి అంత్యక్రియల్లో పాల్గొంటారు. Read:…
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారి బలపడి గులాబ్ తుఫాన్గా మారింది. గులాబ్ తుఫాన్ ఈరోజు రాత్రికి ఒడిశాలో తీరం దాటబోతున్నది. తీరం దాటే సమయంలో భారీ ఎత్తున గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఇక ఒడిశాతో పాటుగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగి తీరప్రాంతాల్లోని ప్రజలను తరలిస్తున్నారు.…