సీఎంకు భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. ముఖ్యమంత్రిపై దాడి జరుగుతుంటే అధికారులు నిద్ర పోతున్నారా.. అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికే భద్రత లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటని నిలదీశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ను విధుల నుండి తప్పించాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాశ్ రెడ్డి
శ్రీకాకుళం జిల్లా పలాసలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు దువ్వాడ శ్రీకాంత్ వైసీపీకి గుడ్బై చెప్పారు.. ఇక, ఆయన బాటలో ఆయన భార్య రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ దువ్వాడ జయశ్రీ కూడా అడుగులు వేశారు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
అంబేద్కర్ జయంతి ముందు రోజు సీఎం జగన్ మీద జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. ఇది చేతకానితనం వల్ల చేసే పిరికిపంద చర్యగా చెపుతున్నామన్నారు. ఇలాంటి దాడులు చేసి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. జగన్ అంటే భయంతోనే ఇలాంటి దాడులు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ బలం లేక కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో ఆపసోపాలు పడుతున్నారని.. జగన్ కి జనం నుండి వస్తున్న అనూహ్య స్పందన చూసి తట్టుకోలేక దాడులు…
రాయి దాడితో సీఎం జగన్ భద్రతపై నిఘా విభాగం కీలక సూచనలు చేసింది. జగన్ బస్సుకు వంద మీటర్ల పరిధిలో జన ప్రవేశం నిషిద్దం..?అని తెలిపింది. మరీ అవసరమైతేనే జగన్ బస్ పరిసరాల్లోకి నేతలు, కార్యకర్తలకు అనుమతి ఇచ్చింది. క్రేన్లు ఆర్చులు, భారీ గజమాలలను తగ్గించాలని సూచించింది. జగన్ కు, జనానికి మధ్య గతంలో మాదిరిగా బారికేడ్లు ఉండేలా చూసుకోవాలని తెలిపింది. అనంత జిల్లా గుత్తిలో సీఎం జగన్ కాన్వాయిపై చెప్పులు, ఇప్పుడు రాళ్లు విసరడంతో నిఘా…
సీఎం జగన్పై దాడి దారుణమని.. దాడిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. . సీఎం జగన్పై రాళ్ల దాడికి పాల్పడ్డారని.. ఇది పిరికిపందల చర్య అంటూ మండిపడ్డారు. దాడికి ఎయిర్గన్ ఉపయోగించి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. ఇది హేయమైన చర్య అని ఆమె ఖండించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసినప్పుడు ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లు అంటూ ఆమె తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్పై జరిగిన దాడి హేయమైన చర్య అని వైసీపీ లోక్సభ అభ్యర్థి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ దాడి వెనుక టీడీపీ నేతలు ఉన్నారని భావిస్తున్నామని.. దీని వెనుక చంద్రబాబు ఉన్నాడని తన అనుమానమని ఆయన అన్నారు.