Azam Khan: సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఆజాం ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంపూర్ లో సివిల్ పోల్స్ ప్రచారంలో పాల్గొన్న ఆయన.. తనకు భయమేస్తోందని, తనను కూడా అతిక్ అహ్మద్ లాగే కాల్చి చంపుతారని భయపడుతున్నానని అన్నారు. నా నుంచి, మా పిల్లల నుంచి మీకు ఏం కావాలి..?
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తానంటూ బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు 19 ఏళ్ల అమీన్గా గుర్తించారు. తన స్నేహితురాలి తండ్రికి చెందిన నంబర్ నుండి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు 'హత్యచేస్తానంటూ బెదిరింపు ఫోన్ చేశారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ని హత్య చేస్తామంటూ వచ్చిన ఓ బెదిరింపు కాల్ కలకలం రేపింది. దుండగుడు టోల్ ఫ్రీ నంబర్ 112కి కాల్ చేశారు. అంతేకారు యూపీ పోలీసుల సోషల్ మీడియా డెస్క్కు కూడా మెసేజ్ చేశాడు. త్వరలో సిఎం యోగిని చంపేస్తాను అంటూ సందేశం పంపాడు.
గ్యాంగ్ స్టార్ అతిక్ అహ్మద్ హత్య అనంతరం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన ప్రకటన చేశారు. యూపీలో ఏ మాఫియా ఎవరినీ బెదిరంచదని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్పై అల్లర్ల రాష్ట్ర కళంకాన్ని తొలగించామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
Atiq Ahmed: అతిక్ అహ్మద్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. గ్యాంగ్ స్టర్, మాఫియాడాన్, మాజీ ఎంపీ అయిన అతీక్ అహ్మద్ ను ముగ్గురు దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘ మాఫియాను మట్టిలో కలిపేస్తా’ అని అన్నంత పనిచేశాడని అనుకుంటున్నారు సాధారణ ప్రజానీకం. అయితే ఎలాగూ జీవితఖైదు శిక్ష పడిన వ్యక్తిని, మరో హత్య కేసు ట్రయల్స్ జరుగున్న వ్యక్తిని ఎందుకు చంపాల్సి వచ్చిందనేది…
Atiq Ahmed: గ్యాంగ్ స్టర్, మాఫియా డాన్, పొలిటికల్ లీడర్ అతిక్ అహ్మద్ హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అతడితో పాటు ఆయన తమ్ముడు అష్రాఫ్ ను ముగ్గురు వ్యక్తులు, జర్నలిస్టులుగా నటిస్తూ అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపి హతమార్చారు. ఉమేష్ పాల్ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వీరిని ప్రయాగ్ రాజ్ లో ఓ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం తీసుకువస్తున్న నేపథ్యంలో ఈ హత్యలు జరిగాయి.
Atiq Ahmed: అతిక్ అహ్మద్ ఒకానొక సమయంలో ఉత్తర్ ప్రదేశ్, ముఖ్యంగా ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో తిరుగులేని డాన్ గా ఎదిగాడు. చివరి రోజులను మాత్రం సీఎం యోగి ఆదిత్య నాథ్ దెబ్బకు బయపడుతూ బతికాడు. ఉత్తర్ ప్రదేశ్ వస్తే ఎప్పుడు ఎన్ కౌంటర్ అవుతానో అని తీవ్రంగా భయపడేవాడు. శనివారం రాత్రి ముగ్గురు నిందితుల చేతిలో అతిక్ అహ్మద్ తో పాటు అతని తమ్ముడు అష్రఫ్ అహ్మద్ దారుణంగా హత్యకు గురయ్యారు.
ఉత్తరప్రదేశ్లోని శ్రావస్తి జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం కోసం పంపి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బహ్రైచ్కు తరలించారు.
Asaduddin Owaisi: ఉత్తర్ ప్రదేశ్ లో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్ ఎన్ కౌంటర్ పై రాజకీయ దుమారం రేగుతోంది. 2005 బీఎస్పీ ఎమ్మెల్యే హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను ఫిబ్రవరిలో హత్య చేశారు. ఈ కేసులో అతీక్ అహ్మద్, అతని కుటుంబ సభ్యులు నిందితులుగా ఉన్నారు.
Yogi Adityanath: గ్యాంగ్ స్టర్, పొలిటికల్ లీడర్ అతీక్ అహ్మద్ కొడుకు అసద్ ను యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం(ఎస్టీఎఫ్) ఈ రోజు ఎన్కౌంటర్ లో లేపేశారు. ఉమేష్ పాల్ హత్య కేసులో కీలక నిందితులు అయిన అసద్ తో పాటు అతని అనుచరుడు గులాంలు ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఢిల్లీ పారిపోతున్న సందర్భంలో ఝాన్సీ వద్ద ఇరు వర్గాల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది.