Yogi Adityanath: పాకిస్తాన్ వెంట ఎవరు ఉండరు.. పీఓకే భారత్లో భాగం కావాలనుకుంటోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో భారత చట్టాలే అమలవుతున్నాయని ఆయన అన్నారు. శాంతి, అభివృద్ధితో కాశ్మీర్ ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. ఈ రోజు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు కూడా భారత్ లో భాగం కావాలని కోరుకుంటున్నారని, వారు కూడా భారత్ లో చేరాలని, పీఓకే భారత్ లో భాగం కావాలని కోరుకుంటున్నారని యోగీ అన్నారు. దరిద్ర పాకిస్తాన్ వెంట ఎవరూ నిలబడరని ఆయన అన్నారు.
Read Also: Assam Floods: అస్సాంలో వర్ష బీభత్సం.. వరదల్లో 31 వేల మంది
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
జనసంపర్క అభియాన్ కింద అంబేద్కర్నగర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా సంబంధాల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్పై సీఎం యోగి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ పరిస్థితి పేదవాడిలా తయారైందని, పాక్ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, అక్కడ ఆహారం కోసం గొడవలు జరుగుతున్నాయని అన్నారు. పీఓకే ప్రజలు భారత్ లో చేరాలని అనుకుంటున్నారని యోగీ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో త్వరలో ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని సీఎం యోగి అన్నారు. ఆర్టికల్ 370ని ఎప్పటికీ తొలగించలేమని ప్రజలు ఏవిధంగా అనుకున్నారు.. ఇప్పుడు ఇదే ఆలోచన తీవ్రవాదంపై ఉందన్నారు. ఆర్టికల్ 370లాగే ఉగ్రవాదం అంతమవుతుందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కాశ్మీర్ భారత్ లో భాగమైందని చెప్పారు. 2024 జనవరిలో శ్రీరాముడి ఆలయం పూర్తవుతుందని, రాంలాలా తన ఆలయంలో కూర్చుంటారని ఆయన తెలిపారు.
#WATCH | Today Kashmir is governed by Indian laws and is moving forward with a new stream of peace and development. Today there is a demand in Pakistan Occupied Kashmir to make them a part of India, they also want to join India. Nobody wants to stand with Pakistan: Uttar Pradesh… pic.twitter.com/sVmUaDgZbb
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 20, 2023
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?