ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం.. ఆరా తీసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను బాధితురాలు వీణా రోజుకొకటి విడుదల చేస్తోంది. అసెంబ్లీలో వీడియో కాల్లో మాట్లాడిన వీడియోను కూడా వీణా బయటపెట్టింది. ఈ మొత్తం వ్యవహారం పై ఇప్పటికే పార్టీ నియమించిన విచారణ కమిటీ దర్యాప్తు మొదలుపెట్టింది. బాధితురాలు విడుదల చేస్తున్న వీడియోలు, వాటి…
ప్రేమకు అడ్డుగా మారిన వయస్సు.. యువకుడు ఆత్మహత్య.. విజయవాడ నగరంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలు తన ప్రేమను అంగీకరించలేదన్న మనోవేదనతో యశ్వంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విజయవాడ చిట్టీనగర్ ప్రాంతంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం, యశ్వంత్ గత రెండేళ్లుగా అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే యువతికి యశ్వంత్ కంటే రెండు సంవత్సరాలు వయసు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రేమను ఇరువురు కుటుంబాలు అంగీకరించలేదు. ఈ క్రమంలో…
* తిరువనంతపురం: ఇవాళ భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదో టీ-20.. రాత్రి 7 గంటలకు గ్రీన్ఫీల్డ్ ఇంటరేషనల్ స్టేడియంలో ప్రారంభంకానున్న మ్యాచ్ * మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ను నియమించే అవకాశం.. ఇవాళ ఎన్సీపీ శాసనసభా పక్ష సమావేశంలో.. ఎల్పీ నేతగా సునేత్ర పవార్ను ఎన్నుకునే అవకాశం.. ఆ తర్వాత ఈ రోజు ప్రమాణస్వీకారం చేయనున్నట్టు చెబుతున్న పార్టీ నేతలు.. * చిత్తూరు: కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన……
తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారం.. ప్రభుత్వానికి సిట్ లేఖ తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రాష్ట్ర ప్రభుత్వానికి కీలక లేఖను పంపింది. ఈ లేఖలో ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, దర్యాప్తులో తేలిన అంశాలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలను సిట్ వివరించినట్టు సమాచారం. సుమారు వంద పేజీలకు పైగా ఉన్న ఈ నివేదికలో, 2019–2024 మధ్యకాలంలో తిరుమల లడ్డూ ప్రసాద తయారీలో చోటుచేసుకున్న అనేక తప్పిదాలను సిట్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. లడ్డూలో…
పవన్ కల్యాణ్పై కాటసాని హాట్ కామెంట్స్.. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ జరగలేదని నిర్ధారణ అయిన నేపథ్యంలో, పవన్ కల్యాణ్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమల మెట్లను పవన్ కల్యాణ్ పై నుంచి కిందికి.. లేదా కింది నుంచి పైకి.. కడుగుతారా అంటూ ఎద్దేవా చేశారు. లోపల…
లిక్కర్ కేసులో నిందితులకు బెయిల్.. హైకోర్టు పెట్టిన షరతులు ఇవే.. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులకు ఏపీ హైకోర్టు బుధవారం కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డితో పాటు ముప్పిడి అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది.…
జనసేన ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు.. విచారణ ప్రారంభం.. మహిళా ఉద్యోగినిపై లైంగిక ఆరోపణలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై విచారణ ప్రారంభమైంది. ఈ ఘటనపై జనసేన పార్టీ ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. విచారణ కమిటీ రైల్వే కోడూరులో పర్యటించి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్, బాధితురాలు, పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు తదితరుల నుంచి వివరాలు…
ఆ వర్గాలకు గుడ్న్యూస్ చెప్పిన ఏపీ కేబినెట్.. కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. మొత్తం 35 అజెండా అంశాలపై చర్చించి రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, మౌలిక వసతులు, గృహ నిర్మాణం, విద్యుత్, పర్యాటక రంగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు…
టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం.. మంత్రులకు సీఎం కీలక సూచనలు.. తిరుమల టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో సిట్ నివేదికపై విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు, తప్పుడు ప్రచారంపై ఏపీ కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. అసలు నెయ్యిలో కల్తీ జరగలేదని సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందన్న తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రివర్గం ఆందోళన వ్యక్తం చేసింది. ఇక, టీటీడీ కల్తీ నెయ్యి…
కోడిని కోసినా కేసులు పెడుతున్నారు.. కూటమికి వినాశనం తప్పదు..! వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కోడిని కోసినా కేసులు పెట్టే పరిస్థితి నెలకొందని, ఈ విధమైన పాలనతో కూటమికి వినాశనం తప్పదని ఆయన హెచ్చరించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లు గడిచినా రాష్ట్ర పరిస్థితి మారలేదని అన్నారు. ప్రభుత్వం ప్రజలను ఇంకా మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తోందని ఆరోపించారు. రాయలసీమతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం…