భారత్-పాకిస్థాన్ యుద్ధం విరమణ విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని భారతదేశం మరోసారి తేల్చి చెప్పింది. తాజాగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు ట్రంప్తో పాటు చైనా కూడా కృషి చేసిందని వ్యాఖ్యానించారు.
దేశ భద్రతపై కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలను దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. నిజమైన భారతీయులు అలాంటి మాటలు అనరని జస్టిస్ దీపాంకర్దత్తా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం సోమవారం వ్యాఖ్యానించింది.