Ashok Gehlot: 2024 లోక్సభ ఎన్నికల ముందు జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ మెజారిటీలో బీజేపీ గెలిచింది. అయితే ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల ఎంపికపై మాత్రం బీజేపీ అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. ఫలితాలు వెలువడి ఆరు రోజులు గడుస్తున్నా.. సీఎంలను ఖరారు చేయలేదు. దీనిపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.