Ashok Gehlot: “ఇదే కాంగ్రెస్ చేస్తే ఊరుకునేదా..?” బీజేపీపై మాజీ సీఎం గెహ్లాల్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashok Gehlot: 2024 లోక్సభ ఎన్నికల ముందు జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ మెజారిటీలో బీజేపీ గెలిచింది. అయితే ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల ఎంపికపై మాత్రం బీజేపీ అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. ఫలితాలు వెలువడి ఆరు రోజులు గడుస్తున్నా.. సీఎంలను ఖరారు చేయలేదు. దీనిపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.
రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. బీజేపీ సీఎంలను ఎంపిక చేయడంలో విఫలమైందని, బీజేపీ అసలు రంగు చూపించిందని, పార్టీలో క్రమశిక్షణ లోపించిందని గెహ్లాట్ ఆరోపించారు. ఒక వేళ గెలిచిన తర్వాత కాంగ్రెస్ సీఎంలను ఎంపిక చేయకపోతే, కాంగ్రెస్లో అంతర్గత పోర, చీలికలు వచ్చాయంటూ బీజేపీ ఆరోపించేదని అన్నారు. సీఎంలను నిర్ణయించకపోతున్నారని, వారు కాంగ్రెస్లో క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నారని గెహ్లాట్ అన్నారు.
Also Read
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
Read Also: Bhavya Bishnoi: ఐఏఎస్తో పెళ్లికి రెడీ అయిన మెహ్రీన్ మాజీ ప్రియుడు.. 3 లక్షల మందికి ఆహ్వానం!
డిసెంబరు 3న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 199 సభ్యుల అసెంబ్లీలో 115 స్థానాలను గెలుచుకున్న తర్వాత రాజస్థాన్లో బిజెపి తన పాలనను ఏర్పాటు చేయనుంది. ఎన్నికల ముందు ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ తన సీఎం అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో బీజేపీ ఎన్నికలకు వెళ్లింది. ఇదిలా ఉంటే గెహ్లాట్ ఆరోపణలపై రాజస్థాన్ బీజేపీ చీఫ్ సీపీ జోషి స్పందించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత సీఎం అభ్యర్థిని ఎన్నిక చేయడానికి కాంగ్రెస్కి 16 రోజులు పట్టిందన్న విషయాన్ని గెహ్లాట్ మరిచిపోయినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రతిపక్ష నేతను ఎందుకు నిర్ణయించలేకపోతోందని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ సీఎం రేసులో మాజీ సీఎం వసుంధర రాజే ముందు వరసలో ఉన్నారు. వీరితో పాటతు మాజీ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ మేఘ్వాల్, పార్టీ ఎంపీలు బాబా బాలక్ నాథ్, దియాకుమారి పోటీలో ఉన్నారు.
తాజావార్తలు
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!